icon icon icon
icon icon icon

షాద్‌నగర్‌లో సినీనటి, ఎంపీ నవనీత్ కౌర్‌పై కేసు

మహారాష్ట్రలోని అమ్రావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌పై తెలంగాణలోని షాద్‌నగర్‌లో కేసు నమోదైంది.

Published : 10 May 2024 14:10 IST

షాద్‌నగర్‌: మహారాష్ట్రలోని అమ్రావతి ఎంపీ, సినీనటి నవనీత్‌ కౌర్‌పై తెలంగాణలో కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల షాద్‌నగర్‌లో ఆమె పర్యటించారు. పట్టణంలోని కూడలిలో మాట్లాడుతూ కాంగ్రెస్‌కు ఓటేస్తే పాకిస్తాన్‌కు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. దీనిపై స్థానిక కాంగ్రెస్‌ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో నవనీత్‌ కౌర్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు షాద్‌నగర్‌ సీఐ ప్రతాప లింగం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img