ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!
ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు.
ఇంటర్నెట్ డెస్క్: లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. జాతీయ పార్టీలైన భాజపా, కాంగ్రెస్ తమదైనశైలిలో ప్రచారం చేస్తూ ప్రజల వద్దకు వెళ్తున్నాయి. అయితే.. ఉత్తరాదిలో ఓ మూడు స్థానాలు మాత్రం ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లు దాదాపు గత మూడు దశాబ్దాలుగా ఇక్కడ ఒక్కసారి కూడా గెలవలేకపోవడం గమనార్హం. అవే జమ్మూకశ్మీర్లోని శ్రీనగర్, బారాముల్లా, ఉత్తర్ప్రదేశ్లోని మైన్పురీ లోక్సభ నియోజకవర్గాలు.
మైన్పురిలో 1996 నుంచి సమాజ్వాదీ పార్టీ వరుసగా గెలుపొందుతూ వస్తుండగా.. కాంగ్రెస్ ఇక్కడ చివరిసారిగా 1984లో గెలుపొందింది. ఇక బారాముల్లా, శ్రీనగర్ నియోజకవర్గాల్లో కొంతకాలంగా జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, నేషనల్ కాన్ఫరెన్స్లు గెలుస్తూ వస్తున్నాయి. ఈ స్థానాల్లో హస్తం పార్టీ చివరిసారిగా 1996లో విజయం సాధించింది. ఇక ఈ స్థానాల్లో భాజపా ఒక్కసారి కూడా ఖాతా తెరవకపోవడం గమనార్హం.
ఎస్పీ కంచుకోట.. మైన్పురీ
- 1996 నుంచి ఈ నియోజకవర్గంలో ఏడుసార్లు లోక్సభ ఎన్నికలు, రెండుసార్లు ఉప ఎన్నికలు నిర్వహించగా.. సమాజ్వాదీ పార్టీయే క్లీన్స్వీప్ చేసింది. ఆ పార్టీ అప్పటి అధినేత ములాయంసింగ్ యాదవ్ మొదటిసారిగా 1996 ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత 2004, 2009, 2014, 2019లో వరుసగా విజయం సాధించారు. 1998, 1999ల్లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ నుంచి బలరామ్సింగ్ యాదవ్ గెలుపొందారు. 2004లో రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ స్థానాన్ని ములాయం వదులుకోవాల్సి వచ్చింది. ఇక 2014లో ఆజంగఢ్ నుంచి కూడా ఆయన గెలుపొందారు. ఈ రెండు సందర్భాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆ పార్టీయే ఈ స్థానాన్ని కాపాడుకుంది.
- ములాయం మరణం అనంతరం 2022లో ఇక్కడ జరిగిన ఉప ఎన్నికలో ఆయన కోడలు డింపుల్యాదవ్ గెలుపొందారు. 2024లో మరోసారి ఇక్కడినుంచి పోటీ పడుతున్నారు. ఇక్కడ భాజపా అభ్యర్థి జైవీర్సింగ్ ఆమెపై పోటీకి దిగారు.
- 2014 ఎన్నికల నుంచి ఇక్కడ భాజపా రెండో స్థానంలో నిలుస్తూ వస్తోంది.
- ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకూ 17 సార్లు ఎన్నికలు జరగ్గా.. కాంగ్రెస్ ఐదుసార్లు(1952, 1962, 1967, 1971, 1984) మాత్రమే గెలుపొందింది.
అక్కడ నేషనల్ కాన్ఫరెన్స్దే హవా..
- 1967 నుంచి శ్రీనగర్లో 13 సార్లు ఎన్నికలు జరగ్గా.. అత్యధికంగా 10 సార్లు నేషనల్ కాన్ఫరెన్స్ గెలుపొందింది. 1971లో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందగా, 1996లో కాంగ్రెస్ విజయం సాధించింది. 2014 ఎన్నికల్లో మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ విజయకేతనం ఎగరవేసింది. ఆ ఎన్నికల్లో పీడీపీతో భాజపా పొత్తు పెట్టుకుంది.
- బారాముల్లాలో 1957 నుంచి 14 సార్లు లోక్సభ ఎన్నికలు జరగ్గా.. నేషనల్ కాన్ఫరెన్స్ 9 సార్లు విజయం సాధించింది. కాంగ్రెస్ నాలుగుసార్లు, పీడీపీ ఒక్కసారి మాత్రమే గెలుపొందాయి.
ఈ మూడు నియోజకవర్గాలకు ఈసారి వివిధ దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మైన్పురీలో మే 7న, శ్రీనగర్లో మే 13న, బారాముల్లాలో మే 20న పోలింగ్ నిర్వహించనున్నారు. ఈసారి ఓటర్లు ఎలాంటి తీర్పు ఇస్తారో చూడాలి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
నిండు గర్భిణికి పురిటి నొప్పులు.. దారి లేక 6 కిలోమీటర్లు డోలీలోనే!
-
పేదింటి ఉత్తమ విద్యార్థులకు విమాన ప్రయాణం
-
విడాకుల్లో ఎవరి జోక్యం లేదు: గాయని సైంధవి
-
రద్దయిన క్రికెట్ మ్యాచ్కు టికెట్ల డబ్బు వాపసు
-
సవాల్ స్వీకరించి.. స్పందనగా ఆచరించి
-
కియా కార్లు అద్దెకూ తీసుకోవచ్చు.. హైదరాబాద్ సహా 6 నగరాల్లో