Kalpana Soren: ‘తలవంచడం అనేది మా డీఎన్ఏలోనే లేదు’ - కల్పనా సోరెన్
అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానని.. తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదని ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) భార్య కల్పనా పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ (Hemant Soren) అరెస్టు ఊహించని పరిణామమని ఆయన భార్య కల్పనా సోరెన్ పేర్కొన్నారు. ఇది జేఎంఎంతోపాటు తమ కుటుంబాన్ని షాక్కు గురిచేసిందన్నారు. పీటీఐ వార్తా సంస్థకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన ఆమె (Kalpana Soren).. తలవంచడమనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదన్నారు. హేమంత్ అడుగుజాడల్లో నడుస్తానని, నిరంకుశ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతానన్నారు.
వారికి వ్యతిరేకంగా పోరాడతా..
‘అన్యాయానికి, నియంతృత్వ శక్తులకు వ్యతిరేకంగా పోరాడతా. ఎందుకంటే, తలవంచడం అనేది గిరిజనుల డీఎన్ఏలోనే లేదు. నా భర్త అడుగుజాడల్లో నడుస్తా. హేమంత్ తన విలువలతో రాజీపడకుండా జైలుకు వెళ్లేందుకే సిద్ధమయ్యారు. నేను ఆయన అర్ధాంగిని. నిరంకుశ శక్తులకు తగిన సమాధానం చెప్పేందుకు ప్రయత్నిస్తా’ అని కల్పనా పేర్కొన్నారు. తన భర్త అరెస్టు రాజకీయ ప్రేరేపితమని, బలవంతంగా భాజపాలో చేర్చుకునే ప్రణాళికలో భాగమన్నారు. తన భర్తను బుజ్జగించి, బెదిరించి, అవమానపరచడమే వారి ప్రయత్నమని, ఈ ఎన్నికల్లో ఓటర్లు వారికి తగిన సమాధానం చెబుతారని అన్నారు.
ప్రతిపక్షాలను అణచివేసేందుకే..
‘న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. హేమంత్ బెయిల్పై బయటకు వచ్చి, లోక్సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) ప్రచారం చేస్తారని ఎదురు చూస్తున్నాం. ఆయన నిర్దోషి. కేంద్రంలో భాజపా ప్రభుత్వం చేసిన కుట్రలో ఇరుక్కున్నారు. దళితులు, గిరిజనులు, పేదల కోసం పనిచేస్తున్న నాయకులను అరెస్టు చేస్తుంటే రాజ్యాంగం ఎలా పరిరక్షించబడుతుంది. 400లకుపైగా సీట్లు వస్తాయంటూ కాషాయ పార్టీ ఇస్తోన్న నినాదాలతో రాష్ట్రంలో వాతావరణం 400ల డిగ్రీలు దాటింది. ఝార్ఖండ్ ప్రజలు భాజపా ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఖనిజ సంపద దోచుకుంటున్న శక్తులను తరిమికొడతాం’ అని కల్పనా స్పష్టం చేశారు. భాజపా ఓ నిరంకుశ శక్తిలా వ్యవహరిస్తోందని.. ప్రతిపక్షాలను అణచివేసేందుకే ప్రయత్నిస్తోందన్నారు.
LS polls: ‘కాలా పత్తర్’లో.. బిహారీ బాబు-సర్దార్జీల పోరు
తమ కుటుంబంలో ఎటువంటి సమస్యలు లేవని.. ఉప ఎన్నికలో భాగంగా నామినేషన్ వేసే సమయంలో హేమంత్ సోదరుడు తమతోనే ఉన్నారని కల్పనా అన్నారు. పార్టీ నుంచి సీతా సోరెన్ వెళ్లిపోవడం ఆమె వ్యక్తిగతమని చెప్పారు. రాజకీయాలు ఎప్పుడూ తన ఎంపిక కాదని.. పరిస్థితులే ఇందులోకి తీసుకొచ్చాయని వివరించారు. ఇక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలపై స్పందించిన ఆమె.. కేవలం ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోనే ఎందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడుగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మెజార్టీ రాకపోతే.. ‘ప్లాన్ బి’ ఉందా..? అమిత్ షా సమాధానమిదే..
Lok sabha elections: లోక్సభ ఎన్నికల్లో మెజార్టీ రాకపోతే.. తదుపరి ప్లాన్ ఏంటని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) సమాధానం ఇచ్చారు. -
ఈడీ సీజ్ చేసిన నోట్లగుట్టలను ఏం చేస్తామంటే.. మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: అవినీతి కేసుల్లో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్మును పేదలకు పంచిపెట్టాలని యోచిస్తున్నామని, ఇందుకు న్యాయ సలహాలను తీసుకుంటామని ప్రధాని మోదీ వెల్లడించారు. -
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు.
తాజా వార్తలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1PM
-
అందరి కళ్లూ అటువైపే.. నాలుగో ప్లేఆఫ్స్ బెర్తు వారిదేనంటున్న లారా
-
‘అమ్మ’ అంతిమయాత్ర అయినా.. ఆస్తి పంచాకే !
-
ఆంక్షలు విధించిన అమెరికాలోనే.. రహస్యంగా ఉత్తర కొరియన్లు వర్క్ఫ్రమ్ హోం
-
టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా ప్రభాస్ పోస్ట్.. ఆ ప్రత్యేక వ్యక్తి ఎవరు?
-
ఏపీఎల్లో చరిత్ర సృష్టించిన ఎస్ఆర్హెచ్ హీరో