Football: మ్యాచ్ మధ్యలోకి పరిగెత్తుకొచ్చిన బాలుడు
ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంటే ప్రేక్షకుల కళ్లన్నీ గోల్ ఎవరు కొడతారనే దానిపైనే ఉంటాయి. నిత్యం ఫుట్బాల్ ఎటువైపు వెళితే అటువైపే తీక్షణంగా చూస్తుంటారు. కానీ, ఎఫ్సీ సిన్సినాటి, ఓర్లాండో సిటీ ఎస్సీ మధ్య అమెరికాలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో అలా జరగలేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఏదైనా మ్యాచ్ జరుగుతున్న సమయంలో తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు మైదానంలోకి ప్రేక్షకులు దూసుకురావడం చూస్తూనే ఉంటాం. అయితే ఎఫ్సీ సిన్సినాటి, ఓర్లాండో సిటీ ఎస్సీ మధ్య అమెరికాలో జరిగిన ఫుట్బాల్ మ్యాచ్లో ఓ చిన్నారి గ్రౌండ్ మధ్యలోకి పరుగెత్తుకు రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. మ్యాచ్ జరుగుతుండగా ఉన్నట్టుండి ఓ రెండేళ్ల బాలుడు గ్రౌండ్ మధ్యలోకి పరుగెత్తాడు. ఎందుకు పరుగెత్తుతున్నాడో తెలియని ప్రేక్షకులు ఒక్క క్షణంపాటు బాలుడ్నే చూడసాగారు. తన వెనకే తల్లి కూడా పరుగెత్తుకుంటూ వచ్చి ఆ బాలుడిని పట్టుకునే ప్రయత్నం చేయగా జారి పడింది. తాజాగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ముందుగా తల్లి, కొడుకుల ఫొటోను జర్నలిస్ట్ సామ్ గ్రీన్ ట్విటర్లో పంచుకున్నారు. తర్వాత ఆ వీడియోను ‘మేజర్ లీగ్ సాకర్’ తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. గతంలోనూ క్రీడాకారులపై విపరీతమైన అభిమానంతో సిబ్బందిని దాటుకొని అలా వచ్చిన సంఘటనలు ఉన్నాయి. కానీ, ఏమీ తెలియని రెండేళ్ల బాలుడు రావడంతో నెటిజన్లు ఈ వీడియోను ఆసక్తిగా వీక్షిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం