21ఏళ్ల కుర్రాడితో వివాహానికి సిద్ధమైన 45ఏళ్ల మహిళ

ప్రియుడి వ్యామోహంతో తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లో నుంచి గెంటేసిన ఓ మహిళ నాలుగో వివాహానికి సిద్ధమైన ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. భిండ్ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ....

Published : 12 Jul 2021 01:11 IST

భిండ్: ప్రియుడి వ్యామోహంతో తన ఐదుగురు కుమార్తెలను ఇంట్లో నుంచి గెంటేసిన ఓ మహిళ నాలుగో వివాహానికి సిద్ధమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. భిండ్ జిల్లా ఝాన్సీ మొహల్లా గ్రామానికి చెందిన 45 ఏళ్ల మహిళ.. మిథున్ అనే 21 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడింది. చాలాకాలం పాటు వారు సహజీవనం కూడా చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని ఆమె కుమార్తెలు మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వచ్చారు. ఈ క్రమంలో.. రెండో కుమార్తెను ఏడాది క్రితమే ఇంట్లో నుంచి తరిమేసింది. ప్రస్తుతం ఆ యువకుడితో వివాహానికి సిద్ధమైంది. ఈ వివాహానికి అడ్డు చెబుతున్న నలుగురు కుమార్తెలను బయటకు పంపేసింది. తల్లి వ్యవహారశైలి నచ్చని ఆమె కుమార్తెలు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదుతో సదరు మహిళను స్టేషన్‌కు తీసుకొచ్చిన పోలీసులు.. ఆమె ప్రియుడ్ని కూడా పిలిచి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్‌తో ప్రియుడు ఆమెతో పెళ్లికి నిరాకరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని