వాట్సాప్లో పీఎన్ఆర్ స్టేటస్..ఎలానో తెలుసా..?
కొవిడ్-19 ప్రభావంతో కొద్ది నెలల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు వాట్సాప్ ద్వారా తమ పిఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు...
ఇంటర్నెట్ డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో కొద్ది నెలల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. లాక్డౌన్ నిబంధనలు సడలించినప్పటికీ వైరస్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పరిమిత సంఖ్యలోనే రైళ్లను నడుపుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు రైల్వేశాఖ సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చింది. ఇందులో భాగంగా ప్రయాణికులు వాట్సాప్ ద్వారా తమ పీఎన్ఆర్ స్టేటస్ తెలుసుకోవచ్చు. రైలోఫై (Railofy) పేరుతో తీసుకొస్తున్న ఈ సేవల ద్వారా ప్రయాణికులు వాట్సాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ (PNR Status)తో పాటు ట్రైన్ లైవ్ స్టేటస్, ట్రైన్ దాటిన స్టేషన్, రాబోయే స్టేషన్ వివరాలు కూడా తెలుసుకోవచ్చు. సాధారణంగా ట్రైన్ స్టేటస్ కోసం ప్రయాణికులు 139 నంబర్కి ఫోన్ చేయాలి లేదా ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా చెక్ చేసుకుంటారు. మరి కొంత మంది థర్డ్ పార్టీ యాప్స్ను ఉపయోగిస్తుంటారు. కొన్ని సార్లు వాటి సేవల్లో అంతరాయం కారణంగా ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన పరిస్థితి. దీన్ని అధిగమించి ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలను అందించేందుకు భారతీయ రైల్వే వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. మరి వాట్సాప్ ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ ఎలా తెలుసుకోవాలో ఒక్కసారి చూద్దామా..
* ముందుగా మీ ఫోన్లో వాట్సాప్ను అప్డేట్ చేయాలి. తర్వాత మీ ఫోన్ లో ‘+91-9881193322’ నంబర్ని రైలోఫై అని లేదా మీకు నచ్చిన ఏదైనా పేరుతో సేవ్ చేసుకోవాలి.
* వాట్సాప్ ఓపెన్ చేసి అందులో కాంటాక్ట్ లిస్ట్లో మీరు సేవ్ చేసిన నంబర్పై క్లిక్ చేస్తే ఛాట్ విండో ఓపెన్ అవుతుంది. అందులో మీ ట్రైన్ టికెట్ పిఎన్ఆర్ నంబర్ టైప్ చేస్తే మీరు వెళ్లాల్సిన ట్రైన్కు సంబంధించిన పూర్తి సమాచారం తెలుస్తుంది.
ఐఆర్సీటీసీ వినియోగదారులు, రైల్వే ప్రయాణికులు ఎవరైనా ప్రయాణ తేదీకి ఒక రోజు ముందు నుంచి 10 నుంచి 20 సార్లు రైలోఫై ద్వారా పీఎన్ఆర్ స్టేటస్ను తెలుసుకోవచ్చు. ఈ వాట్సాప్ సేవల ద్వారా తరచుగా ప్రయాణికులు రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని పొందొచ్చని రైలోఫై తెలిపింది. అంతేకాదు రైలులో ప్రయాణిస్తున్నపుడు కూడా రాబోయే స్టేషన్ గురించిన సమాచారం తెలుస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి