TS: రిజిస్ట్రేషన్ స్లాట్ బుక్ చేసుకోండిలా!
రాష్ట్రంలో మూడునెలల తరువాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ల బుకింగ్ను తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనుండగా అందుకోసం స్లాట్ల బుకింగ్ కొనసాగుతోంది
హైదరాబాద్ : తెలంగాణలో మూడునెలల తరువాత వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైకోర్టు అనుమతితో రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్ల బుకింగ్ను తప్పనిసరి చేసింది. సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు జరగనుండగా అందుకోసం స్లాట్ల బుకింగ్ కొనసాగుతోంది. సంబంధిత శాఖ వెబ్సైట్ ద్వారా స్లాట్లను పొందవచ్చు. పౌరులకు, బిల్డర్లకు విడిగా లాగిన్ సదుపాయం కల్పించారు. స్లాట్ల బుకింగ్తో పాటు ఇతర సేవలు వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు.
స్లాట్ బుకింగ్ ఇలా...
రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ https://registration.telangana.gov.in/ ద్వారా స్లాట్లను ఆన్లైన్లో పొందవచ్చు. వెబ్సైట్లో బుక్ యువర్స్లాట్ను క్లిక్ చేసి మొబైల్ నంబర్ నమోదు చేయటం ద్వారా ఆ సదుపాయాన్ని పొందవచ్చు. ముందుగా పోర్టల్లో మొబైల్ నంబర్ రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తరువాత మొబైల్ నంబర్, పాస్వర్డ్, కాప్చా నమోదుచేయాలి. అక్కడనున్న స్లాట్ బుకింగ్ లింక్ను క్లిక్ చేసి ముందుకెళ్లాల్సి ఉంటుంది. సేల్, మార్ట్గేజ్, గిఫ్ట్ లావాదేవీలు ఎంచుకునే వీలు ఉంటుంది. ఆస్తి వివరాలు, ఆస్తి ఉన్న ప్రాంతం, జిల్లా సబ్ రిజిస్ట్రర్ కార్యాలయాల వివరాలు నమోదు చేయాలి. తదుపరి దశలో ఆస్తికి సంబంధించిన వివరాలు, సర్వే నంబర్, ఫ్లాట్ నంబర్ సరిహద్దులు తదితరాలను నమోదు చేయాలి. మూడోదశలో మార్కెట్ రుసుము, రిజిస్ట్రేషన్ ఫీజు నిర్ధారణ అవుతుంది. ఆస్తి వివరాల ఆధారంగా రిజిస్ట్రేషన్ రుసుమును సాఫ్ట్వేర్ ఖరారు చేస్తుంది. స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ రుసుం, పాస్ పుస్తకం, కొరియర్ ఛార్జీలు ఉంటాయి.
తదుపరి దశలో అమ్మకందారు వివరాలు చిరునామా నమోదు చేయాలి. అయిదో దశలో కొనుగోలు దారు వివరాలు, చిరునామా, ఆరోదశలో కొనుగోలుదారు కుటుంబ సభ్యుల వివరాలు పొందుపర్చాలి. ఏడో దశలో సాక్షుల పేర్లు చేర్చాలి. ఆ తరువాత డాక్యుమెంట్ను చూసుకోవచ్చు. ఈ ప్రక్రియ పూర్తి అయ్యాక ఎనిమిదో దశలో అన్లైన్ లేదా చలానా ద్వారా నిర్దేశిత రిజిస్ట్రేషన్ రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపు ప్రక్రియ పూర్తి అయ్యాక తొమ్మిదో దశలో స్లాట్ను ఎంచుకోవాల్సి ఉంటుంది.
సమస్యలు తలెత్తితే...!
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఆధార్ సంఖ్య ఇవ్వటం ఇష్టం లేనివారికి వేరే లింక్ను ఏర్పాటు చేశారు. ఓపెన్ ప్లాట్లకు ఆస్తిపన్ను అంచనాకు సంబంధించి సంఖ్య ఉండదు కాబట్టి పీటీఐఎన్ లేదా టీపీఐఎన్ సంఖ్య కోసం వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్లాట్కు సంబంధించిన అన్ని వివరాలతో పాటు, లే అవుట్ , హద్దులను పొందుపరిచి రిజిస్టర్డ్ డ్యాకుమెంట్ను జతపరచాల్సి ఉంటుంది. ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని ప్రస్తావించేందుకు ఇష్యూస్ ట్రాకర్ పేరిట ప్రత్యేక లింక్ను ఇచ్చారు. ఎలాంటి లాగిన్ అవసరం లేకుండా నిషేధిత ఆస్తుల వివరాలు పొందే అవకాశాన్ని కల్పించారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన కార్యాలయంతో పాటు స్లాట్ల లభ్యతను తెలుసుకునే సదుపాయాన్ని వెబ్సైట్లో పొందుపరిచారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి