
ఆహారం, నీటి కాలుష్యం వల్లే వింత వ్యాధి!
ఇంటర్నెట్ డెస్క్: ఏలూరు ప్రజల అనారోగ్యానికి గల కారణాలపై జాతీయ పరిశోధన సంస్థలు జల్లెడ పడుతున్నాయి. ఏలూరుతో పాటు పరిసర ప్రాంతాల్లోనూ జాతీయ పోషకాహార సంస్థ ఎన్ఐఎస్ శాస్త్రవేత్తలు పలు నమూనాలు సేకరించారు. ఏలూరు పడమర వీధి, దక్షిణపు వీధి, కొత్తపేట తదితర ప్రాంతాల్లోనూ కూరగాయలు, నీరు, పాలు, బియ్యం, నూనెతోపాటు పలు నమూనాలు తీసుకున్నారు. ఆహారం, నీటి కాలుష్యం వల్లే ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని ఎన్ఐఎన్ శాస్త్రవేత్త జేజే బాబు పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగుల రక్త, మూత్ర నమూనాలను సేకరించి పరిశోధనలు జరుపుతున్నట్లు ఆయన వెల్లడించారు. దానిపై ఆధారాలు సేకరించి శుక్రవారం నాటికి ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
ఇవీ చదవండి..
ఏలూరు పరిసర ప్రాంతాల నీటిలో రసాయనాలు
ఏలూరు బాధితులు స్టేట్మెంట్ నమోదు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.