పెద శేషవాహనంపై దేవదేవుడు
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో............
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు సాయంత్రం ధ్వజారోహణతో అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఈ వేడుకల్లో భాగంగా శ్రీవారి వాహన సేవలను ప్రారంభించారు. తొలి రోజు పెద శేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారిని ఆలయ మండపంలో కొలువుదీర్చి వాహన సేవ నిర్వహించారు. స్వామివారి వాహనాన్ని ప్రత్యేకంగా అలంకరించారు.
కలియుగ వైకుంఠ నాథుడు తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో తొలిరోజు జరిగే పండుగే పెద శేషవాహన ఉత్సవం. ఆద్యంతం కన్నుల పండువగా సాగిన ఈ సేవలో శ్రీనివాసుడు శేషతల్పంపై అధిష్ఠించి దర్శనమిచ్చారు. స్వామి కొలువున్న కొండ శేషాద్రి. అందుకే తొలిరోజు పెద శేష వాహనంపై నుంచి భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. విషోగ్రుడైన శేషుని అధిష్ఠించిన దేవదేవుడు మానవుల్లోని కల్మశాన్ని హరిస్తాడన్నది ఈ సేవలోని అంతరార్థం. తిరు ఆభరణాల అలంకృతుడై ఉభయ దేవేరులతో కలగలిసి వీనులవిందు చేసే మలయప్పను దర్శిస్తే సర్వపాపాలు తొలగిపోతాయనేది భక్తుల విశ్వాసం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.