68 ఏళ్ల మహిళ.. ఓ దీవి.. రూ.25 లక్షలు
ఉన్నత చదువులు అభ్యసించిన సంపన్నులే వ్యాపారాలు చేయగలుగుతారన్న అపోహను చెరిపేశారు ఓ 68 ఏళ్ల మహిళ. తనకున్న వ్యవసాయ భూమిని ఏకంగా ఓ దీవిగా మార్చేసి పలు రకాల వ్యాపారం చేస్తున్నారు....
గూగుల్ మెచ్చిన వ్యాపావేత్త
ఇంటర్నెట్ డెస్క్: ఉన్నత చదువులు అభ్యసించిన సంపన్నులే వ్యాపారాలు చేయగలుగుతారన్న అపోహను చెరిపేశారు ఓ 68 ఏళ్ల మహిళ. తనకున్న వ్యవసాయ భూమిని ఏకంగా ఓ దీవిగా మార్చేసి పలు రకాల వ్యాపారం చేస్తున్నారు. పదో తరగతితోనే చదువు మానేసిన ఉత్తరప్రదేశ్లోని కన్నౌగ్ గుందాకు చెందిన కిరణ్ రాజ్పూత్ ప్రస్తుతం ఏడాదికి రూ.25 లక్షలు సంపాదిస్తున్నారు. ఇతరులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. కిరణ్.. తనకున్న 25 బిగాల వ్యవసాయ భూమిని దీవిగా మార్చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం పర్యాటకంగా కళకళలాడుతోంది. ఇక్కడ బోటింగ్ చేసేందుకు యువత ఆసక్తి చూపుతున్నారు. ఇక్కడ పెంచుతున్న చేపలు, పండిస్తున్న పండ్లు కిరణ్కు అదనపు ఆదాయం తెచ్చిపెడుతున్నాయి.
చేపలు చెరువులు ప్రారంభించేందుకు కిరణ్కు ప్రభుత్వం నుంచి రుణంగా కేవలం రూ.2 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో ఇంట్లో దాచుకున్న డబ్బుతోపాటు, బంధువుల సాయంతో మొత్తం 11 లక్షలు సమకూర్చి చేపల చెరువుపై పెట్టుబడి పెట్టారు. ఆ చేపల చెరువులను విజయవంతంగా నడుపుతూ రూ.5 నుంచి 7 లక్షల వరకు లాభం పొందుతున్నారు. ఈ దీవిపై మొత్తంగా రూ.20 నుంచి 25 లక్షల వ్యాపారం జరుగుతున్నట్లు కిరణ్ కుమారుడు వెల్లడించారు.
‘మొదట్లో అనేక కష్టాలు పడ్డాం. కొద్ది మొత్తంలో డబ్బు సమకూర్చుకొని చేపల చెరువుపై పెట్టుబడి పెట్టాం. ఇప్పుడు అదే పెద్ద వ్యాపారంగా మారింది. ఈ వ్యాపారం గురించి ఔత్సాహితులకు కూడా నేర్పించాం’ అని కిరణ్ పేర్కొన్నారు. గూగుల్ సైతం కిరణ్ రాజ్పుత్ విజయాన్ని ప్రశంసించింది. ఈ ప్రాంతంలోని ఇతర రైతులకు కిరణ్ రాజ్పూత్ ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇవీ చదవండి...
తాబేళ్ల సునామి ఎప్పుడైనా చూశారా!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి