వారిపై కరోనా ప్రభావం చాలా అరుదు
ఇటీవలి ఓ కరోనా అధ్యయనంలో తల్లితండ్రులకు ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి.
లండన్: ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందికి సోకుతున్న కొవిడ్-19 మహమ్మారి తమ చిన్నారికి సోకవచ్చనే ఆలోచనే తల్లితండ్రుల్లో ఒత్తిడి పెంచుతుంది. ఇక నవజాత శిశువుల తల్లితండ్రులు, కాబోయే తల్లితండ్రులు కూడా కరోనా కాలంలో ఆందోళనకు గురవటం సహజం. అయితే ఇటీవలి ఓ అధ్యయనంలో వీరికి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. నవజాత శిశువులపై కొవిడ్-19 తీవ్ర ప్రభావం చూపదని బ్రిటన్కు చెందిన శాస్త్రవేత్తలు అంటున్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులకు కరోనా వైరస్ సోకినప్పటికీ వారిలో 90 శాతం మంది పూర్తిగా కోలుకుంటున్నారని వారు తెలిపారు. కరోనా తీవ్ర ప్రభావం వారిపై చాలా అరుదని తేల్చారు. ఈ అధ్యయన ఫలితాలు లాన్సెట్ జర్నల్లో ప్రచురించారు.
లక్షణాలేంటంటే..
లండన్లోని ఇంపీరియల్ కాలేజ్కు చెందిన శాస్త్రవేత్తలు 29 రోజుల కంటే తక్కువ వయసున్న చిన్నారులపై మార్చి నుంచి ఏప్రిల్ చివరి వరకు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. కొవిడ్ సోకిన చిన్నారుల్లో అధిక జ్వరం, పాలు తాగకపోవడం, వాంతులు, జలుబు, దగ్గు, నీరసం వంటి ముఖ్య లక్షణాలుంటాయని వారు తెలిపారు. 1785 మంది నవజాత శిశువుల్లో ఒకరికి మాత్రమే ఆసుపత్రిలో ఉంచి చికిత్స అందించాల్సిన పరిస్థితి తలెత్తిందని.. ఇది 0.06 శాతమని వివరించారు. ఇక 36 శాతం మందికి కృత్రిమ శ్వాస అందించాల్సి వచ్చిందన్నారు. అయితే వారిలో ఎవరూ చనిపోలేదని అధ్యయనకారులు స్పష్టం చేశారు.
తల్లి నుంచి వేరుగా ఉంచాలా?
కరోనా సోకిన పసివారిలో నాలుగో వంతు నెలలు నిండకుండా పుట్టిన వారే అని పరిశోధకులు తెలిపారు. 66 మందిలో 17 మందికి తల్లి ద్వారా కొవిడ్ నుంచి సోకిందని.. మరో ఆరుగురికి ఆస్పత్రిలో ఉండగా సోకిందని వారు తెలిపారు. తల్లికి కరోనా సోకినా, సోకిందనే అనుమానం ఉన్నా పుట్టిన బిడ్డను వెంటనే తల్లినుంచి వేరుగా ఉంచాలన్నది అంతర్జాతీయ నిబంధనల్లో భాగమని.. అయితే ఆ విధంగా చేసినప్పటికీ 17 మందిలో ఏడుగురికి కొవిడ్ సోకిందన్నారు. ఇక తమ అధ్యయన ఫలితాల ప్రకారం.. కరోనా సోకిన తల్లి నుంచి శిశువును వేరు చేయటం తప్పనిసరి కాదని వారు తెలిపారు. కాగా, గత ఆరు నెలలుగా మాతా శిశు ఆస్పత్రులు, వైద్య కేంద్రాల్లో కరోనా కట్టడి చర్యలు గణనీయంగా అభివృద్ధి చెందాయని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
భానుడి వేడి..దొరకని నాడి
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
సాంకేతిక జోరు.. అరచేతిలో హోరు
ర్యాలీలు, బహిరంగ సభలు, ఇంటింట ప్రచారం.. ఇదంతా ఎన్నికల ప్రచారంలో ఒక ఎత్తు. ప్రస్తుతం అభ్యర్థులు తమ ప్రచారం ఎక్కువ మందికి చేరేందుకు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుంటున్నారు. -
జగనన్న.. భూభక్ష చట్టం
ఇసుక అక్రమంగా తవ్వారు.. మట్టినీ దోచుకున్నారు.. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా ధ్వంసం చేశారు. వీటన్నింటినీ ఖాళీ చేశారు. ఇప్పటికే కనిపించిన ఖాళీ జాగాలు, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వైకాపా నేతల కన్ను ప్రజల స్థలాలపై పడింది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (05/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
గిల్ ఇంకా నేర్చుకోవాలి.. నాయకత్వ పటిమ అద్భుతం: డేవిడ్ మిల్లర్
-
నిజ్జర్ హత్య కేసు.. నిందితుల అరెస్టుపై స్పందించిన ట్రూడో
-
ఇది రజనీకాంత్ స్టైల్ మూవీ కాదు: రానా ఆసక్తికర వ్యాఖ్యలు
-
‘ఆఫ్టర్ 9’ పబ్పై దాడి.. 160 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
-
మ్యాక్సీ ఆటతీరుపై కామెంట్.. పార్థివ్కు తప్పని బాడీ షేమింగ్
-
దండంతో సరి.. హామీలు మరిచారేం మరి.. స్థానిక సమస్యలపై మాట్లాడని జగన్