రోగుల ఎదుట నృత్యం చేస్తోన్న వైద్యులు

కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న చికిత్సకు శ్రీకారం చుట్టింది. వడోదరలోని పారుల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు మ్యూజిక్‌ థెరపీని వైద్యులు ప్రారంభించారు....

Published : 18 Apr 2021 00:55 IST

వడోదరా: కరోనా బాధితుల్లో నెలకొన్న భయాలను పోగొట్టి, వారిలో మానసిక స్థైర్యం నింపేందుకు గుజరాత్‌లోని ఓ ఆసుపత్రి సిబ్బంది వినూత్న రీతిలో చికిత్సకు శ్రీకారం చుట్టింది. వడోదరలోని పారుల్‌ ఆసుపత్రిలో కొవిడ్‌ బాధితులకు మ్యూజిక్‌ థెరపీని వైద్యులు ప్రారంభించారు. రోగుల ఎదుట సంగీతానికి అనుగుణంగా నృత్యం చేస్తూ వారిని ఉత్సాహపరుస్తున్నారు. ఇలా చేయడం ద్వారా కొవిడ్‌ గురించి బాధితుల్లో ఉన్న ఆందోళన తగ్గి వారిలో మానసిక స్థైర్యం పెరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. మ్యూజిక్‌ థెరపీకి రోగులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని