CRDA: 14 ఎకరాల వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు.. ధరెంతంటే?
సీఆర్డీఏ పరిధిలోని 14 ఎకరాల భూమి వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
గుంటూరు: సీఆర్డీఏ పరిధిలోని 14 ఎకరాల భూమి వేలానికి ఏపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. నవులూరు సమీపంలోని బైపాస్ వద్ద 10 ఎకరాలు, పిచ్చుకలపాలెం వద్ద 4 ఎకరాలను ఈ-ఆక్షన్ పోర్టల్ ద్వారా వేలం వేయాలని నిర్ణయించింది. గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన అధికారులు ధరను ఖరారు చేశారు. నవులూరు వద్ద ఎకరా రూ.5.94కోట్లు, పిచ్చుకలపాలెం వద్ద ఎకరా రూ.5.41కోట్లుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వేలానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.
సీఆర్డీఏ పరిధిలోని భూముల విక్రయంపై రాజధాని ప్రాంత రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. తుళ్లూరులోని దీక్షా శిబిరంలోమహిళలు కళ్లకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. రాజధాని అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పుడు భూముల అమ్మకాలేంటని రైతులు నిలదీస్తున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కోర్టు ధిక్కరణ కిందికే వస్తుందన్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
BJP: ప్రధాని మోదీ టార్గెట్ విజన్-2047: కేంద్ర మంత్రి మేఘ్వాల్
-
India News
Manipur: ప్రజలను మానవకవచాలుగా వాడుకొని దాడులు.. మణిపుర్ వేర్పాటు వాదుల కుట్ర
-
India News
Bimal Hasmukh Patel: కొత్త పార్లమెంట్ను చెక్కిన శిల్పి.. ఎవరీ బిమల్ పటేల్
-
Movies News
Siddharth: రియల్ లైఫ్లో లవ్ ఫెయిల్యూర్.. సిద్దార్థ్ ఏం చెప్పారంటే
-
Crime News
Warangal: లింగనిర్ధరణ చేసి గర్భస్రావాలు.. 18 మంది అరెస్టు
-
Sports News
Ambati Rayudu: ఈ గుంటూరు కుర్రాడికి ఘాటెక్కువే.. ఆటకు అంబటి రాయుడు గుడ్బై