ఏపీలో ఐఏఎస్‌ పోస్టుల్లో మార్పులు.. జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎవరంటే?

ఏపీలో ఐఏఎస్‌ అధికారుల పోస్టుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు తితిదే ఈవోగా జవహర్‌రెడ్డిని ప్రభుత్వం

Updated : 08 May 2022 11:08 IST

అమరావతి: ఏపీలో ఐఏఎస్‌ అధికారుల పోస్టుల్లో మార్పులు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం జగన్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్‌రెడ్డిని నియమించారు. ఈ మేరకు తితిదే ఈవోగా జవహర్‌రెడ్డిని ప్రభుత్వం రిలీవ్‌ చేసింది. మరోవైపు తితిదే ఏఈవో ధర్మారెడ్డికి ఈవోగా పూర్తి బాధ్యతలు అప్పగించింది. 

నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్‌ ఎండీగా సత్యనారాయణ.. యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా శారదా దేవిని నియమించారు. ప్రస్తుతం యువజన సర్వీసుల శాఖ కమిషనర్‌గా ఉన్న నాగరాణిని రిలీవ్ చేశారు. మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శిగా సెర్ప్‌ సీఈవో ఇంతియాజ్‌ను నియమిస్తూ.. ఆయనకు పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని