AP News: కోడి పందెంలో బుల్లెట్‌ సొంతం

సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పాలకోడేరు మండలం శృంగవక్షంలో  కౌరు రామయ్య అతని స్నేహితుడు కలిసి

Published : 16 Jan 2022 03:54 IST


పాలకోడేరు: సంక్రాంతి పండుగ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. పాలకోడేరు మండలం శృంగవక్షంలో  కౌరు రామయ్య అతని స్నేహితుడు కలిసి రూ.2.40లక్షల విలువైన రాయల్‌ ఇన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ను ఇటీవల కొనుగోలు చేశారు. ఇవాళ కోడి పందేల్లో పాల్గొన్న ఇద్దరూ బుల్లెట్‌ను పందెంలో పెట్టారు. ఈ పందెంలో కౌరు రామయ్య గెలిచి బుల్లెట్‌ను సొంతం చేసుకున్నాడు. గెలుపొందిన ఆనందంలో బుల్లెట్‌తో బరిలోనే కొద్దిసేపు చక్కర్లు కొట్టాడు. వినూత్నంగా నిర్వహించిన ఈ కోడి పందేన్ని పందెం రాయుళ్లు ఆసక్తిగా తిలకించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని