Ap News: అందరి లక్ష్యం ఒకటే.. కలిసి పోరాడితేనే సాధిస్తాం: సూర్యనారాయణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ జీవోల వ్యవహారంలో అన్ని ఉద్యోగ సంఘాలు ఐక్యంగా ఉండాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కె.సూర్యనారాయణ అన్నారు. అందరి లక్ష్యం ఒకటే అయినందున కలిసి పోరాడితేనే లక్ష్యాన్ని సాధించగలమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంతానికి పోకుండా జీవోలపై పునఃసమీక్ష చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల పేర్లు వేరైనప్పటికీ వారంతా ఉద్యోగులేనని స్పష్టం చేశారు. అసుతోష్ మిశ్రా కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవాలి తప్ప అధికారుల కమిటీ సిఫార్సులు కాదని చెప్పారు. చట్ట ప్రకారం ఉన్న వేతనాలను తగ్గించేందుకు అవకాశం లేనప్పుడు.. పీఆర్సీ జీవోలు ఇచ్చి వేతనాలు ఎలా తగ్గిస్తారని ప్రశ్నించారు. హెచ్ఆర్ఏ తగ్గించిన ప్రభుత్వం మండల స్థాయిలో రూ. 1,600కు ఒక గది ఎక్కడైనా అద్దెకు ఇప్పిస్తారా? అని నిలదీశారు. ఈ అంశంపై కొందరు మంత్రులు బాధ్యతారాహిత్యంగా మాట్లాడకూడదని సూర్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులంతా ఒక నిర్ణయానికి రావాలని.. అన్ని ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పీఆర్సీ సాధన సమితిగా ఏర్పడతామని సూర్యనారాయణ వెల్లడించారు.
సీఎం జగన్ చొరవ తీసుకోవాలి: వెంకట్రామిరెడ్డి
‘‘ఉద్యోగులంతా చర్చించుకొని ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తాం. హెచ్ఆర్ఏపై చర్చించకుండా నిర్ణయం తీసుకోవడం బాధాకరం. కేంద్ర పీఆర్సీ కంటే నష్టం జరిగేలా ఉత్తర్వులు ఇచ్చారు. ప్రభుత్వం వెంటనే జీవోలను వెనక్కి తీసుకోవాలి. ఉద్యోగుల ఆలోచనలకు అనుగుణంగా.. ఉద్యోగుల అభిప్రాయాలను తీసుకొని కొత్త జీవోలు ఇవ్వాలి. ఏకపక్షంగా ఇచ్చిన జీవోలను రద్దు చేసుకోవాలి. ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలా సీఎం జగన్ చొరవ తీసుకోవాలి’’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి పేర్కొన్నారు.
పీఆర్సీ జీవోలపై ఉద్యోగులు వరుసగా నిరసనలకు దిగుతున్నారు. అన్ని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం జారీ చేసిన జీవోలను వ్యతిరేకిస్తున్నాయి. ఇవాళ్టి నుంచి నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరుకావాలని వారు నిర్ణయించారు. ఏపీజేఏసీ, ఏపీజేఏసీ అమరావతి, సచివాలయ ఉద్యోగుల సంఘాల ఉద్యోగుల నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్నారు. జీవోల వ్యవహారంపై ఇవాళ ఉద్యోగ సంఘాలు అంతర్గత సమావేశం నిర్వహించి ఉద్యమ కార్యాచరణపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం