పే..ద్ద కుటుంబం..సంక్రాంతికి అదరగొట్టారు!

ఈరోజుల్లో పండగ నాడు పట్టుమని పది మంది కుటుంబసభ్యులు ఒకచోట కలవడమే కష్టమవుతోంది. అలాంటిది 300 మంది కలవడమంటే మాటలా! కలిసివారంతా ఒకే రంగు, ఒకే రకమైన దుస్తులు ధరించి వస్తే...

Published : 17 Jan 2020 00:25 IST

నాగుల్లంక: ఈరోజుల్లో పండగ నాడు పట్టుమని పది మంది కుటుంబసభ్యులు ఒకచోట కలవడమే కష్టమవుతోంది. అలాంటిది 300 మంది కలవడమంటే మాటలా! కలిసివారంతా ఒకే రంగు, ఒకే రకమైన దుస్తులు ధరించి వస్తే అది నిజంగా కన్నుల పండుగే. తూర్పుగోదావరి జిల్లా  నాగుల్లంక గ్రామంలో లక్కింశెట్టి వారి కుటుంబం సరిగ్గా ఇదే చేసింది. వారి కుటుంబంలోని 300 సంక్రాంతి సందర్భంగా నీలం రంగు దుస్తులు ధరించి సంబరాలు చేసుకున్నారు. ‘ఈనాడు ఆదివారం అనుబంధం’లో చూసి తమకు ఈ ఆలోచన వచ్చిందని చెబుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని