మిర్యాలగూడలో మారుతీరావు అంతిమయాత్ర

హైదరాబాద్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన   మారుతీరావు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే తండ్రి

Published : 09 Mar 2020 11:40 IST

మిర్యాలగూడ : హైదరాబాద్‌లో నిన్న అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన   మారుతీరావు అంత్యక్రియలు కాసేపట్లో జరగనున్నాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అంతిమయాత్ర ప్రారంభమైంది. కుటుంబసభ్యులు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అయితే తండ్రి మృతదేహాన్ని చూసేందుకు కూతురు అమృత తనకు పోలీసు భద్రత కావాలని కోరింది. కానీ ఆమె రాకను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదని కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమృత రాకుండానే అంత్యక్రియలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.

మారుతీరావు అంతిమయాత్రలో స్థానిక ఎమ్మె్ల్యే భాస్కర్‌రావు, మున్సిపల్‌ ఛైర్మన్‌ భార్గవ్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని