రాజధానిపై అఫిడవిట్‌ దాఖలు చేయండి

విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం విచారణ

Updated : 24 Apr 2020 12:37 IST

అమరావతి: విశాఖకు ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమరావతి పరిరక్షణ సమితి కార్యదర్శి గద్దె తిరుపతిరావు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు ..పది రోజుల్లోగా పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను 10 రోజులకు వాయిదా వేసింది.
ప్రస్తుతం వెలగపూడిలో ఉన్న సచివాలయాన్ని విశాఖకు మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, దాన్ని నిలువరించాలని పిటిషన్‌లో కోరారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌ తరలింపుపై ఉద్యోగ సంఘాల ప్రకటనతో పాటు విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌లో చెప్పిన అంశాలను ఈ సందర్బంగా పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని