విచక్షణతోనే నిర్ణయం తీసుకున్నా: రమేశ్కుమార్
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్
అమరావతి: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) తీసుకొనే నిర్ణయాలన్నీ ఈసీ కార్యదర్శికి చెప్పాల్సిన అవసరం లేదని మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. ఎస్ఈసీ పదవీకాలం కుదింపు వ్యాజ్యంపై రిప్లై పిటిషన్ వేసిన ఆయన కమిషనర్ పనుల్లో సాయం చేసేందుకే సెక్రటరీ విధులు పరిమితమని పేర్కొన్నారు. ఎన్నికల వాయిదా గోప్యంగా తీసుకోవాల్సిన నిర్ణయమని చెప్పిన ఆయన.. ఈసీ న్యాయవిభాగం వాయిదా నోటిఫికేషన్ తయారు చేశాకే తాను సంతకం చేశానని వివరించారు. విచక్షణతో వాయిదావేసే అధికారం ఎన్నికల కమిషనర్కు ఉంటుందని తెలిపారు. ఎస్ఈసీ నిర్ణయాలన్నీ ఈసీ ఉద్యోగులతో చర్చించాల్సిన అవసరం లేదని రమేశ్కుమార్ స్పష్టంచేశారు. పదవీ కాలం కుదింపు వ్యాజ్యంపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన తుది అఫిడవిట్పై హైకోర్టులో రేపు వాదనలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10లక్షలిచ్చి ఖాళీ పేపర్ పెట్టండి.. మేం రాసిపెడతాం: నీట్ పరీక్షలో ఓ టీచర్ నిర్వాకం
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు