ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ షాక్
ఏపీలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మాణాలను నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణాది ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడుపై చేపడుతున్న నిర్మాణాలపై
పోతిరెడ్డిపాడుపై నిర్మాణాలు నిలిపివేయాలని ఉత్తర్వులు
హైదరాబాద్: ఏపీలోని పోతిరెడ్డిపాడు ఎత్తిపోతల పథకం వద్ద నిర్మాణాలను నిలిపివేయాలంటూ జాతీయ హరిత ట్రైబ్యునల్ (ఎన్జీటీ) స్టే విధించింది. ఈ మేరకు ఎన్జీటీ దక్షిణాది ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడుపై చేపడుతున్న నిర్మాణాలపై నారాయణపేటకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి ఎన్జీటీకి ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టిన జస్టిస్ రామకృష్ణన్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పోతిరెడ్డిపాడు వద్ద నిర్మాణాలు చేపడితే పర్యావరణంపై పడే ప్రభావంపై పరిశీలన చేసేందుకు 4 శాఖల సభ్యులతో కమిటీ నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. కేఆర్ఎంబీ, కేంద్ర పర్యావరణ శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, ఐఐటీ హైదరాబాద్కు చెందిన నిపుణులు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. పర్యావరణ ప్రభావంపై రెండు నెలల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా కమిటీని ఎన్జీటీ ఆదేశించింది. కమిటీ నివేదిక వచ్చేవరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఎన్జీటీ ఉత్తర్వుల్లో పేర్కొంది.
మరోవైపు చట్టవిరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రాజెక్టులు కడుతోందంటూ ఏపీ ప్రభుత్వ ఫిర్యాదుపై గోదావరి నదీ యాజమాన్య బోర్డు స్పందించింది. ఫిర్యాదులో ఏపీ ప్రభుత్వం పేర్కొన్న అంశాలకు సంబంధించి పూర్తి వివరాలు, డీపీఆర్లను సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్కు బోర్డు సభ్యుడు పి.ఎస్.కుటియాల్ లేఖ రాశారు. కాళేశ్వరం, గోదావరి మూడో దశ, తుపాకులగూడెం, మిషన్ భగీరథ, పెన్గంగపై మూడు ఆనకట్టలు, రామప్పచెరువు నుంచి పాకాలకు నీటి మళ్లింపుకు సంబంధించిన డీపీఆర్ వివరాలు సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి