సంతోష్‌ పార్థివదేహం సూర్యాపేట తరలింపు

భారత్‌ సరిహద్దుల్లో చైనా దురాగతానికి అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఆ వీర జవాను పార్థివ దేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో...

Updated : 17 Jun 2020 20:43 IST

రేపు ఉదయం 8 గంటలకు అంత్యక్రియలు

హైదరాబాద్‌: భారత్‌ సరిహద్దుల్లో చైనా దురాగతానికి అమరుడైన కర్నల్‌ సంతోష్‌బాబు పార్థివదేహం హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంది. ఆ వీర జవాను పార్థివ దేహానికి తెలంగాణ గవర్నర్‌ తమిళిసైతో మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఎంపీ రేవంత్‌ రెడ్డి, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంతోష్‌బాబు భార్య, పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. ప్రత్యేకంగా అంబులెన్స్‌లో సంతోష్‌బాబు పార్థివదేహాన్ని సూర్యాపేటకు తరలించారు. తొలుత హైదరాబాద్‌లోనే అంత్యక్రియలు నిర్వహించాలని అధికారులు కోరగా.. తాము స్వస్థలంలోనే నిర్వహించుకుంటామని ఆయన తల్లిదండ్రులు చెప్పడంతో రేపు ఉదయం 8 గంటలకు సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు సూర్యాపేట నుంచి స్వస్థలమైన కేసారం వరకు అంతిమయాత్ర నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో అధికారులు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే సంతోష్‌బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని