రూ.10కి భోజనం పెట్టిన తాత కన్నుమూత

నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత కాలంలో రూ.10కి భోజనం పెట్టిన వృద్ధుడు రాము కన్నుమూశారు. సుమారు 50 సంవత్సరాలుగా ...

Updated : 13 Jul 2020 09:30 IST

టీనగర్‌, న్యూస్‌టుడే: నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్న ప్రస్తుత కాలంలో రూ.10కి భోజనం పెట్టిన వృద్ధుడు రాము కన్నుమూశారు. సుమారు 50 సంవత్సరాలుగా రాము హోటల్‌ నిర్వహిస్తున్నారు. స్థానికులు మాట్లాడుతూ... ప్రారంభం నుంచే ఆయన రూపాయి, రూ.2లకే భోజనం పెట్టేవారని తెలిపారు. ఇటీవల కాలంలోనే ఆయన ధరను రూ.10కి పెంచారన్నారు. కొందరు భోజనం చేశాక తోచినంత సాయం అందించేవారని చెప్పారు. వారితోపాటు స్నేహితులు, స్వచ్ఛంద సంస్థలు కూడా అండగా నిలిచాయని తెలిపారు. ఆ మొత్తంతోనే మిగతావారికి కూడా తక్కువ ధరకే భోజనం పెట్టేవారని గుర్తుచేసుకున్నారు. కుటుంబ ఖర్చులకు లేకపోయినా హోటల్‌ నిర్వహణను మాత్రం మానుకోలేదని కొనియాడారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని