అటు కళ్లె.. ఇటు ఫోన్ పరీక్షలు!
కరోనా వ్యాప్తిని నివారించటానికి, తగు చికిత్స అందించటానికి వైరస్ను త్వరగా, కచ్చితంగా గుర్తించటం ముఖ్యం. ప్రస్తుతం దూదిపుల్లతో ముక్కు, గొంతు స్రావాలను తీసి
కరోనా వ్యాప్తిని నివారించటానికి, తగు చికిత్స అందించటానికి వైరస్ను త్వరగా, కచ్చితంగా గుర్తించటం ముఖ్యం. ప్రస్తుతం దూదిపుల్లతో ముక్కు, గొంతు స్రావాలను తీసి పరీక్షిస్తుండటం తెలిసిందే. దీంతో కొన్ని చిక్కులు లేకపోలేదు. నమూనాలు తీయటానికి నిపుణులైన సిబ్బంది అవసరం. ఒంటి నిండా రక్షణ కవచం కప్పుకోవాలి. పరీక్ష చేయించుకునేవారికీ అసౌకర్యమే. ఇలాంటి ఇబ్బందులేవీ లేకుండా తేలికగా పరీక్ష చేయగలిగితే? ఇలాంటి ఆలోచనలతోనే బ్రైగమ్ అండ్ వుమెన్స్ హాస్పిటల్ పరిశోధకులు కళ్లె పరీక్ష మీద దృష్టి సారించారు. ఇదీ సార్స్ కోవ్2ను కచ్చితంగా.. ఆ మాటకొస్తే ముక్కు, గొంతు స్రావ పరీక్షల కన్నా మరింత పెద్దమొత్తంలో వైరస్ను గుర్తిస్తుండటం గమనార్హం. గట్టిగా దగ్గినప్పుడు వచ్చే కళ్లెను ఎవరికి వారు ఇంట్లోనే సీసాలో పట్టుకోవచ్చు. దీంతో పరీక్ష చేయటం చాలా తేలిక. మరి దగ్గు రానివారి సంగతో? ఇలాంటివారికి దూదిపుల్ల పరీక్షే ఉత్తమమైనప్పటికీ లాలాజలంతోనూ వైరస్ ఆనవాళ్లను పట్టుకునే ప్రయోగాలూ నడుస్తున్నాయి. అంతేనా? జార్జి వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు మరో అడుగు ముందుకేసి ఫోన్ సాయంతో వైరస్ను పసిగట్టే సన్నటి ‘వెంట్రుక’లాంటి పరికరాన్నీ రూపొందించారు. పలుచటి బంగారు పూతతో కూడిన దీని మీద సార్స్ కోవ్2కు అంటుకుపోయే ప్రొటీన్ ద్రావణాన్ని పూస్తారు. నమూనాను దీనిపై రుద్దినప్పుడు, అందులో వైరస్ ఉంటే పరికరానికి అతుక్కుపోతుంది. ఆ వెంటనే రంగు మారుతుంది. దీన్ని ఫోన్ కెమెరాలు గుర్తించి ఫొటో తీస్తాయి. ఇది అందుబాటులోకి వస్తే ఎవరైనా, ఎక్కడైనా పరీక్షలు చేయటానికి ఉపయోగపడుతుందనటంలో సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఓటీటీలోకి యాక్షన్ థ్రిల్లర్ ‘యోధ’.. ప్రస్తుతానికి అద్దె ప్రాతిపదికన..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
రేమండ్ వివాదం.. డైరెక్టర్గా నవాజ్ మోదీ తొలగింపు!
-
అలా చేయాలని చెబితే.. భారత్ నుంచి వెళ్లిపోతాం: వాట్సప్
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి