TS News: బతికున్నప్పుడు చూడలేదు.. పోయాకా మారలేదు
కన్నబిడ్డలు చూసుకోవడం లేదనే ఆవేదనతో తొంభయ్యేళ్ల వయసులో ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడటమే విషాదం అయితే....ఆయన అంత్యక్రియలకూ వారు ముందుకురాకపోవడం మరింత బాధాకరం. మనసులు కలచివేసే ఈ సంఘటన
తండ్రి అంత్యక్రియలకు ముందుకురాని తనయులు
సర్పంచి, పోలీసుల జోక్యంతో పూర్తి
తొర్రూరు టౌన్, న్యూస్టుడే: కన్నబిడ్డలు చూసుకోవడం లేదనే ఆవేదనతో తొంభయ్యేళ్ల వయసులో ఒక వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడటమే విషాదం అయితే....ఆయన అంత్యక్రియలకూ వారు ముందుకురాకపోవడం మరింత బాధాకరం. మనసులు కలచివేసే ఈ సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... గ్రామానికి చెందిన చిన్నసాయిలు (90)కు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. అందరికీ వివాహాలయ్యాయి. కుమారులు మల్లయ్య, ఎల్లయ్య కరీంనగర్లో కూలి పని చేసుకుంటున్నారు.భార్య పదేళ్ల కిందట మరణించింది. నాటి నుంచి సాయిలు ఒంటరిగా ఉండేవాడు. ఇటీవల అనారోగ్యానికి గురయ్యాడు. తనను ఎవరూ చూడటంలేదని మనస్తాపానికి గురై మంగళవారం ఇంట్లో ఉరి వేసుకున్నాడు. గ్రామస్థులు సమాచారం ఇవ్వడంతో ఇద్దరు కుమారులు మధ్యాహ్నం కంఠాయపాలెంకు చేరుకున్నారు. దహన సంస్కారాలు చేయడానికి ఇద్దరూ ముందుకురాలేదు. నచ్చజెప్పినా వినకపోవడంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారమిచ్చారు. సర్పంచి శ్రీపాల్రెడ్డి, కానిస్టేబుల్ సాయికిరణ్లు కౌన్సెలింగ్ చేయడంతో కుమారులిద్దరూ మంగళవారం సాయంత్రం తండ్రికి అంత్యక్రియలు నిర్వహించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి