Perni Nani: బందరు రావయ్యా.. ఏదో ఒక బటన్ నొక్కవయ్యా..!
మన జిల్లాలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది.
సీఎంను ఏకవచనంతో సంబోధించిన పేర్ని నాని
ఈనాడు, అమరావతి
‘నాకంటే వయస్సులో చిన్నవాడైనా.. పాదాభివందనం చేస్తున్నాను. పాలాభిషేకం చేయాలి’
‘మన జిల్లాలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది. ఒక్కసారి బందరు రావయ్యా.. ఇక్కడికి వచ్చి ఆటోవాళ్లకో, మత్స్యకారులకో... విద్యాదీవెనో.. ఏదో ఒక బటన్ నొక్కవయ్యా..! అని జగన్ను పిలిచాను. ఆయన రాలేదు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ బందరు ఓడరేవు పనులు చేపడతానని.. అప్పుడే వస్తానన్నాడు..! ఇప్పుడు బందరు వచ్చాడు’
‘సీఎం జగన్ను కలిసే అవకాశం మళ్లీ దక్కుతుందో లేదో.. కొద్దిగా కష్టమైనా ఉక్కపోత ఉన్నా.. భరించాల్సిందే.’
ఇది మాజీ మంత్రి బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) సోమవారం సీఎం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు. సీఎం నేరుగా పేర్ని నానిని ఏమీ అనకపోయినా.. సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి పేర్ని నానితో ఈ విషయం ప్రస్తావించినట్లు తెలిసింది.
ఏం జరిగిందంటే..!
బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మంగినపూడి నుంచి బస్సులో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మార్గంలో సీఎంకు కట్టిన స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలో ఎక్కడ చూసినా.. పేర్ని కిట్టు పేరు, చిత్రాలతోనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే పేర్ని నాని చిత్రాలు ఉన్నాయి. బహిరంగ సభ వేదికపై పేర్ని నాని ప్రసంగించే సమయంలో అక్కడక్కడ ఏకవచనంతో సంబోధించారు. ‘రావయ్యా..‘ ‘వచ్చాడు’ వంటి పదాలు దొర్లాయి. సభ ముగిసిన తర్వాత తిరిగి బస్సులో హెలీప్యాడ్కు వెళ్లే సమయంలో సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి ఈ అంశాన్ని పేర్ని నానితో ప్రస్తావించినట్లు తెలిసింది. సీఎంను సభలో ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. అలా సంబోధించడం మంచిది కాదని సూచించినట్లు సమాచారం. ఆసమయంలో బందరు ఎంపీతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు బస్సులో ఉన్నారు. ‘సీఎం వద్దంటున్నా.. పదేపదే రిటైర్మెంట్ గురించి ఎందుకు మాట్లాడతారు..? అది కరెక్టు కాదు.. ఇది ఎలాంటి సంకేతాలను సూచిస్తుంది..!’ అన్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో తాను రిటైర్మెంట్ అవుతానని నాని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అనధికార సంభాషణల్లో సైతం తన కుమారుడు పేర్ని కిట్టు(కృష్ణమూర్తి)కి టిక్కెట్ అడుగుతున్నట్లు ఆయన చెబుతున్నారు. రాజకీయంగా పేర్ని కిట్టు ప్రమోషన్ పెద్దఎత్తున జరుగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం, స్టిక్కర్ల కార్యక్రమంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలకు ఆయనే హాజరు అవుతున్నారు. బందరు నగరపాలక సంస్థలో, నియోజకవర్గంలో పేర్ని కిట్టు చక్రం తిప్పుతున్నారు. ఈ అంశం వైకాపా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఇక ‘స్థానిక’ సందడి!
రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు ముగియడంతో అన్ని రాజకీయ పార్టీల దృష్టి స్థానిక సంస్థల ఎన్నికలపై కేంద్రీకృతం కానుంది. లోక్సభ ఎన్నికల అనంతరం స్థానిక సంస్థల సమరం ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. -
డీఎస్పీ చైతన్య యూనిఫాం తీసేసి.. వైకాపా కండువా వేసుకుంటే బెటర్: వర్ల రామయ్య
వైకాపా మూకలకు సహకరించి డీఎస్పీ చైతన్య... పోలీసు దుస్తులు తీసేసి, వైకాపా కండువా వేసుకోవాలని తెదేపా పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య ధ్వజమెత్తారు. -
భారాస ధర్నాలు చేయడం తగదు
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రైతులను నిలువునా ముంచిన భారాస నేతలు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ ధర్నాలు నిర్వహించడం తగదని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్కుమార్గౌడ్ విమర్శించారు. -
పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడడం దుర్మార్గం: సీపీఐ
పోలింగ్ అనంతరం రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడడంలో పోలీసులు విఫలం కావడం విచారకరమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. -
అధికార పార్టీకి అనుకూలంగా సీఎస్: పాతూరి నాగభూషణం
ఈ ఎన్నికల్లో ఓటమి పాలవుతున్నట్లు తెలిసినందువల్లే వైకాపా నేతలు ఎన్నికల సంఘంపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారని భాజపా మీడియా ఇన్ఛార్జి పాతూరి నాగభూషణం విమర్శించారు. -
రిజర్వేషన్లు పెంచకుండా స్థానిక ఎన్నికలొద్దు
రాష్ట్రంలో బీసీల రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. -
అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలి: సీపీఎం
క్వింటా వడ్లకు రూ.500 బోనస్ చెల్లిస్తామంటూ ఎన్నికల ప్రణాళికలో చెప్పిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని సీపీఎం కోరింది. -
అచ్చంపేట ఘటనలపై డీజీపీకి భారాస ఫిర్యాదు
అచ్చంపేటలో రౌడీయిజం పెరిగిపోయిందని, నయా నయీమ్ ముఠాలను చూస్తున్నామని నాగర్కర్నూల్ భారాస ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ ఆందోళన వ్యక్తంచేశారు. -
‘దొడ్డు వడ్లకూ రూ.500 బోనస్ ఇవ్వాల్సిందే’
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. సన్న వడ్లతో పాటు దొడ్డు వడ్లకు కూడా క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని భారాస నేతలు డిమాండ్ చేశారు. -
ఇండియా కూటమి విషయంలో దీదీ వ్యాఖ్యలు నమ్మలేం: అధీర్ రంజన్
ఇండియా కూటమికి వెలుపలి నుంచే తమ మద్దతు ఇస్తామని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను నమ్మలేమని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ ఆరోపించారు.
తాజా వార్తలు (Latest News)
-
కిడ్నాప్ చేసి.. పొరుగింట్లోనే 26 ఏళ్లు బంధించి..!
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ