Perni Nani: బందరు రావయ్యా.. ఏదో ఒక బటన్ నొక్కవయ్యా..!
మన జిల్లాలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది.
సీఎంను ఏకవచనంతో సంబోధించిన పేర్ని నాని
ఈనాడు, అమరావతి
‘నాకంటే వయస్సులో చిన్నవాడైనా.. పాదాభివందనం చేస్తున్నాను. పాలాభిషేకం చేయాలి’
‘మన జిల్లాలో మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు కొడాలి నాని, వెలంపల్లి శ్రీనివాస్, సామినేని ఉదయభాను, రక్షణనిధిని చూస్తే కాస్త ఈర్ష్యగా ఉంటుంది. ఒక్కసారి బందరు రావయ్యా.. ఇక్కడికి వచ్చి ఆటోవాళ్లకో, మత్స్యకారులకో... విద్యాదీవెనో.. ఏదో ఒక బటన్ నొక్కవయ్యా..! అని జగన్ను పిలిచాను. ఆయన రాలేదు. పాదయాత్ర సందర్భంగా ఆయన ఇచ్చిన హామీ బందరు ఓడరేవు పనులు చేపడతానని.. అప్పుడే వస్తానన్నాడు..! ఇప్పుడు బందరు వచ్చాడు’
‘సీఎం జగన్ను కలిసే అవకాశం మళ్లీ దక్కుతుందో లేదో.. కొద్దిగా కష్టమైనా ఉక్కపోత ఉన్నా.. భరించాల్సిందే.’
ఇది మాజీ మంత్రి బందరు ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) సోమవారం సీఎం బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలు. సీఎం నేరుగా పేర్ని నానిని ఏమీ అనకపోయినా.. సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి పేర్ని నానితో ఈ విషయం ప్రస్తావించినట్లు తెలిసింది.
ఏం జరిగిందంటే..!
బందరు పోర్టుకు శంకుస్థాపన చేసిన అనంతరం మంగినపూడి నుంచి బస్సులో బహిరంగ సభ వేదిక వద్దకు చేరుకున్నారు. మార్గంలో సీఎంకు కట్టిన స్వాగతతోరణాలు, ఫ్లెక్సీలో ఎక్కడ చూసినా.. పేర్ని కిట్టు పేరు, చిత్రాలతోనే ఉన్నాయి. కొన్ని చోట్ల మాత్రమే పేర్ని నాని చిత్రాలు ఉన్నాయి. బహిరంగ సభ వేదికపై పేర్ని నాని ప్రసంగించే సమయంలో అక్కడక్కడ ఏకవచనంతో సంబోధించారు. ‘రావయ్యా..‘ ‘వచ్చాడు’ వంటి పదాలు దొర్లాయి. సభ ముగిసిన తర్వాత తిరిగి బస్సులో హెలీప్యాడ్కు వెళ్లే సమయంలో సీఎంవో కార్యదర్శి కె.ధనుంజయరెడ్డి ఈ అంశాన్ని పేర్ని నానితో ప్రస్తావించినట్లు తెలిసింది. సీఎంను సభలో ఏకవచనంతో సంబోధించడం సరికాదన్నారు. అలా సంబోధించడం మంచిది కాదని సూచించినట్లు సమాచారం. ఆసమయంలో బందరు ఎంపీతోపాటు కొంతమంది ఎమ్మెల్యేలు బస్సులో ఉన్నారు. ‘సీఎం వద్దంటున్నా.. పదేపదే రిటైర్మెంట్ గురించి ఎందుకు మాట్లాడతారు..? అది కరెక్టు కాదు.. ఇది ఎలాంటి సంకేతాలను సూచిస్తుంది..!’ అన్నట్లు తెలిసింది. ఇటీవల కాలంలో తాను రిటైర్మెంట్ అవుతానని నాని ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. అనధికార సంభాషణల్లో సైతం తన కుమారుడు పేర్ని కిట్టు(కృష్ణమూర్తి)కి టిక్కెట్ అడుగుతున్నట్లు ఆయన చెబుతున్నారు. రాజకీయంగా పేర్ని కిట్టు ప్రమోషన్ పెద్దఎత్తున జరుగుతోంది. గడప గడపకు మన ప్రభుత్వం, స్టిక్కర్ల కార్యక్రమంతోపాటు ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాలకు ఆయనే హాజరు అవుతున్నారు. బందరు నగరపాలక సంస్థలో, నియోజకవర్గంలో పేర్ని కిట్టు చక్రం తిప్పుతున్నారు. ఈ అంశం వైకాపా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ట్విటర్ (ఎక్స్)లో అడుగుపెట్టిన కేసీఆర్
భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. -
మా పార్టీ పుట్టుక సంచలనం.. దారి పొడవునా రాజీలేని రణం: కేటీఆర్
తమ పార్టీ పుట్టుక సంచలనం... దారి పొడవునా రాజీలేని రణం అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు -
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు
అన్నమయ్య జిల్లాలో దుండగులు దాష్టీకానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం విట్టలం వద్ద తెదేపా ప్రచార వాహనంపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. -
30న తెనాలికి చంద్రబాబు
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 30న తెదేపా అధినేత చంద్రబాబు గుంటూరు జిల్లా తెనాలి రానున్నారని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, కూటమి నియోజకవర్గ అభ్యర్థి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. -
వైకాపా బాధితులకు న్యాయం చేయాలి
వైకాపా పాలనలో అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ శనివారం నుంచి నిరవధిక నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఆదర్శ మహిళా మండలి అధ్యక్షురాలు కోవూరు శ్రీలక్ష్మి వెల్లడించారు. -
అమరవీరుల స్తూపాన్ని శుద్ధి చేసిన కాంగ్రెస్ నేతలు
ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి హరీశ్రావు అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద అడుగుపెట్టి మలినం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆక్షేపించారు. -
పేదల అభ్యున్నతే భారాస లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర సమితి.. భారత రాష్ట్ర సమితిగా పరిణతి చెంది.. రైతులు, శ్రామికులు, బడుగు బలహీన వర్గాలు, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పోరాటం కొనసాగిస్తోందని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు. -
కాంగ్రెస్లో కొనసాగుతున్న చేరికలు
కాంగ్రెస్లో చేరికలు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి సంభాని చంద్రశేఖర్ అసెంబ్లీ ఎన్నికల్లో సత్తుపల్లి టికెట్ ఆశించారు. -
సంక్షిప్త వార్తలు (8)
దేశవ్యాప్తంగా శుక్రవారం జరిగిన రెండోదశ లోక్సభ ఎన్నికల పోలింగు భాజపా సారథ్యంలోని ఎన్డీయేకు శుభసూచకమని, అధికార కూటమికి అపూర్వమైన మద్దతు లభించినట్లు ప్రధాని మోదీ తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ తేదీలు వచ్చేశాయ్.. ఈ ఫోన్లపై డిస్కౌంట్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మారుతీ నుంచి అందుబాటు ధరకే త్వరలో హైబ్రిడ్ కారు
-
వాటిని తెంచుకున్నంత సులువుగా ప్రేమను వదులుకోలేకపోయా: కమల్ హాసన్
-
ఐటీలో తగ్గుతున్న ఉద్యోగులు.. టాప్-5 కంపెనీల్లో 69 వేల మంది!
-
అధికారిక ప్రకటనే లేదు.. ‘రామాయణ’ షూట్ ఫొటోలు వైరల్