Kurnool: ఎంపీ అవినాష్‌ తల్లి ఆరోగ్యంపై హెల్త్‌బులెటిన్‌

కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Updated : 25 May 2023 14:23 IST

కర్నూలు: కడప ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో కర్నూలులోని విశ్వభారతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు బులెటిన్‌ను విడుదల చేశారు. గత మూడు రోజుల్లో శ్రీలక్ష్మి ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడిందని పేర్కొన్నారు. వాంతులు తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ చేయగా ఎలాంటి సమస్యలు కనిపించలేదన్నారు. ప్రస్తుతం ఆమె నోటిద్వారానే ఆహారం తీసుకుంటున్నట్లు వైద్యులు హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొన్నారు. బీపీ, పల్స్‌, శ్వాస తీసుకోవడం తదితర అంశాలన్నీ సాధారణంగానే ఉన్నాయని చెప్పారు. త్వరలోనే ఆమెను సీసీయూ నుంచి సాధారణ వార్డుకు షిప్ట్‌చేయనున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని