ఖమ్మం, కామారెడ్డి ఘటనలపై నివేదిక ఇవ్వండి.. ప్రభుత్వాన్ని కోరిన గవర్నర్‌ తమిళిసై

ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకు బలవన్మరణం సహా ఇతర నేర ఘటనలపై గవర్నర్...

Updated : 21 Apr 2022 20:43 IST

హైదరాబాద్‌: ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, కామారెడ్డి జిల్లాలో తల్లీకొడుకు బలవన్మరణం సహా ఇతర నేర ఘటనలపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని నివేదిక కోరారు. మీడియాలో వచ్చిన కథనాలు, భాజపా రాష్ట్ర శాఖ వినతి మేరకు గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖమ్మం, కామారెడ్డి జిల్లాల్లో ఆత్మహత్యలతో పాటు రాష్ట్రంలో ఇటీవల చోటుచేసుకున్న పరువు హత్య, గ్యాంగ్ రేప్ తదితర నేర ఘటనలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమగ్ర నివేదికను కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని