AP High court: ఐఆర్‌ఆర్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా

అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన  పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది.

Published : 13 Dec 2023 17:58 IST

అమరావతి: అమరావతి ఇన్నర్‌ రింగ్‌రోడ్డు కేసులో ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన  పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. సీఐడీ తరఫు న్యాయవాది.. వాదనలు వినిపించేందుకు సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు గురువారానికి వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసులో పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్‌ మంగళవారం కొంత వరకు వాదనలు వినిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని