డిప్యూటీ సీఎంపై.. ‘సీఎం’దే పైచేయి
ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం. ఓ పక్క నిండైన గ్రామీణ వాతావరణం.. మరోవైపు విశాఖ నగరాన్ని ఆనుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కలగలిసి ఉన్న ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు వేదికగా మారింది.
ఆసక్తికరంగా అనకాపల్లి రాజకీయం
కూటమి లోక్సభ అభ్యర్థిగా పట్టుబిగిస్తున్న సీఎం రమేష్
అసెంబ్లీ అభ్యర్థులతో కలిసి ముందడుగు
ప్రభుత్వ వ్యతిరేకతతో వైకాపా అభ్యర్థుల ఎదురీత
ఉత్తరాంధ్ర ముఖద్వారం అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం. ఓ పక్క నిండైన గ్రామీణ వాతావరణం.. మరోవైపు విశాఖ నగరాన్ని ఆనుకుని పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతం కలగలిసి ఉన్న ఈ నియోజకవర్గం ఆసక్తికర రాజకీయాలకు వేదికగా మారింది. కూటమి తరఫున లోక్సభ అభ్యర్థిగా నిలిచిన రాజ్యసభ మాజీ సభ్యుడు సీఎం రమేష్ తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల్లో అనుభవం ఉన్న నాయకుడు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు వైకాపా నుంచి పోటీ పడుతున్నారు. గట్టి పోటీగా మారుతుందని భావించినా తాజా రాజకీయ సమీకరణాలు, అభ్యర్థుల బలాబలాలు, ప్రయత్నాలు, పోటీ తీరు గమనిస్తే ఈ నియోజకవర్గంలో సీఎం రమేష్ పట్టు బిగించినట్లు కనిపిస్తోంది. పోటీకి దిగిన కొద్ది రోజుల్లోనే ఆయన నియోజకవర్గంపై పూర్తి స్థాయిలో అవగాహన ఏర్పరుచుకుని, పావులు కదుపుతున్నారు. ఒకానొక దశలో వైకాపా తన అభ్యర్థి ముత్యాలనాయుణ్ని మార్చే ఆస్కారమూ ఉందన్న ప్రచారం జరిగింది. రమేష్ పట్టు బిగించారనడానికి ఇదొక దృష్టాంతం. ఆయన ముందు నుంచి వ్యూహాత్మకంగానే ఈ స్థానాన్ని ఎన్నుకుని, ఇక్కడ అభ్యర్థిత్వం దక్కించుకున్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు శాసనసభ స్థానాల్లో కూటమి అభ్యర్థుల గెలుపులోనూ రమేష్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఒకరికి ఒకరు బలమవుతున్నారు.
బూడి నెగ్గుకురాగలరా?
మాడుగుల ఎమ్మెల్యేగా గెలుపొంది, వైకాపా ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న బూడి ముత్యాలనాయుణ్ని ఆ పార్టీ అనకాపల్లి లోక్సభ అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన విద్యార్హతలు, గ్రామీణ నేపథ్యంతో.. దిల్లీలో లోక్సభలో ఎంత వరకు నెగ్గుకురాగలరనే చర్చ ప్రజల్లో ఉంది. ఎప్పటి నుంచో రాజ్యసభ సభ్యుడిగా ఉండి, దిల్లీలో లాబీయింగ్ చేసే సత్తా ఉన్న నాయకుడు సీఎం రమేష్ నియోజకవర్గానికి రావడాన్ని అనకాపల్లి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. భాజపా అభ్యర్థి కావడంతో కేంద్రంతో సంప్రదించి, నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేస్తారనే విశ్వాసం ఆయనకు సానుకూలంగా మారింది. అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత కొద్ది రోజుల్లోనే రమేష్ వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. ఆయన కుటుంబసభ్యులంతా అనకాపల్లిలో ఇల్లు తీసుకుని, నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను చక్కదిద్దుతున్నారు. భాజపా స్థానిక నాయకుల సహకారం తీసుకుంటున్నారు. ఒక్కొక్కరు ఒక్కో శాసనసభ స్థానం బాధ్యతలు తీసుకుని అక్కడ అన్ని పార్టీల నేతలను సమన్వయం చేస్తున్నారు. మూడు, నాలుగు సంస్థలతో సర్వేలు చేయిస్తూ, ప్రజాభిప్రాయం, రాజకీయ సమీకరణాలపై సమాచారం సేకరిస్తూ తదనుగుణంగా శాసనసభ నియోజకవర్గ అభ్యర్థుల పరంగానూ సమన్వయం చేసుకుంటున్నారు. ఏ నియోజకవర్గంలో ఇబ్బంది ఉందో గుర్తిస్తూ అక్కడ రమేష్ బృందం వాలిపోతోంది. ఇక్కడ కమలం గుర్తును ప్రజల్లోకి తీసుకువెళ్లడం కొంత సవాల్గా ఉండటంతో భాజపా అనుబంధ సంస్థలతో కలిసి ఈ విషయంలో ప్రత్యేకంగా కృషి చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి ముత్యాలనాయుడికి జగన్ ప్రభుత్వ వ్యతిరేకత ప్రధాన ప్రతికూలాంశం. శాసనసభ నియోజకవర్గాల అన్నింటిలోనూ అధికార వైకాపా నాయకుల అరాచకాలు ఆయనకు ప్రతికూలంగానూ, కూటమికి అనుకూలంగానూ మారుతున్నాయి. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలో పాయకరావుపేట, నర్సీపట్నం, చోడవరం, మాడుగుల నియోజకవర్గాల్లో తెదేపా, అనకాపల్లి, ఎలమంచిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో జనసేన బరిలో నిలిచాయి.
ధర్మశ్రీకి కష్టకాలం
నియోజకవర్గం: చోడవరం
ప్రస్తుత ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి కరణం ధర్మశ్రీ ఈ ఎన్నికల్లో ఆపసోపాలు పడుతున్నారు. మాటకారితనంతో ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నా నియోజకవర్గంలో ఏ సమస్యలూ పరిష్కరించకపోవడం ఆయనకు ప్రతికూలంగా మారింది. భీమిలి- నర్సీపట్నం రోడ్డు సింహభాగం చోడవరం నియోజకవర్గం మీదుగా వెళ్తుంది. నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు నిధులతో చేపట్టిన ఈ పనులు ముందుకు సాగలేదు. ఈ రోడ్డు అధ్వానంగా ఉండటం, నియోజకవర్గంలో వైకాపా పెద్దల అక్రమాలు ధర్మశ్రీకి వ్యతిరేకత పెంచుతున్నాయి. నియోజకవర్గంలో వైకాపా నాయకుల మధ్య విభేదాలను సర్దిపుచ్చడానికే ఈయన సమయం సరిపోతోంది. తెలుగుదేశం నుంచి ఇప్పటికే రెండుసార్లు ఎమ్మెల్యేగా వ్యవహరించిన కె.ఎస్.ఎన్.ఎస్.రాజు మళ్లీ బరిలో నిలిచారు. స్థానిక ఎమ్మెల్యేపై ఉన్న వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత ఆయనకు కలిసొచ్చేలా ఉంది. అంతర్గతంగా ఉన్న ఇబ్బందులను సర్దుబాటు చేసుకుని సమష్టిగా ఎన్నికల బరిలో పోరాడుతుండటం విజయావకాశాలను మెరుగుపరుస్తోంది.
దూసుకుపోతున్న అనిత
నియోజకవర్గం: పాయకరావుపేట
తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత కూటమి అభ్యర్థిగా తన వాక్చాతుర్యంతో నియోజకవర్గంలో దూసుకువెళ్తున్నారు. క్యాడర్ అంతా కలిసి వచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలను, స్థానిక సమస్యలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేసిన అభివృద్ధి పనులు కలిసొచ్చే అంశంగా ఉన్నాయి. అదే సమయంలో వైకాపా అభ్యర్థి కంబాల జోగులు నియోజకవర్గానికి కొత్త కావడంతో ఇంకా సర్దుబాటు చేసుకోలేకపోతున్నారు. పార్టీ క్యాడర్ మధ్య సమన్వయం లేదు. అవన్నీ సరిదిద్దే నాయకుడు లేకపోవడం వైకాపాకు ప్రతికూలాంశం. నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు పరిష్కారం కాలేదు. కోటవురట్ల మండలంలో వంతెనల నిర్మాణం పూర్తవలేదు. వరాహ నదిపై తెదేపా ప్రభుత్వ హయాంలోనే వంతెన నిర్మించినా వైకాపా ప్రభుత్వం రూ.50 లక్షలతో అప్రోచ్ రోడ్డు వేయకపోవడం విమర్శలపాలవుతోంది. తాండవ, ఏటికొప్పాక చక్కెర కర్మాగారాలు మూతపడి కార్మికులు రోడ్డునపడగా.. బకాయిలు అందక చెరకు రైతులు నష్టపోయారు. దీనికితోడు ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వైకాపాకు ప్రతికూలతను, కూటమికి విజయావకాశాలను పెంచుతున్నాయి.
కూటమి, సామాజిక బలంతో పంచకర్ల
నియోజకవర్గం: పెందుర్తి
కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ ఎన్నికల బరిలో దూసుకువెళ్తున్నారు. మూడు లక్షలకు పైగా ఓట్లున్న ఈ నియోజకవర్గంలో అందులో సగం ఓట్లున్న పెందుర్తి మండలంలో తెదేపాకు పట్టు ఎక్కువ. ఈ అర్బన్ ప్రాంతంలో మొత్తం 15 మంది కార్పొరేటర్లు తెదేపాకు చెందినవారే. ఇక్కడ 15 పంచాయతీలు తెదేపాకు అనుకూలం. ఇక్కడ తెదేపా నియోజకవర్గ ఇన్ఛార్జి గండి బాబ్జి, పీలా శ్రీనివాస్ తదితరులు కూడా కలిసి పని చేస్తున్నారు. సామాజిక సమీకరణాలు కూడా పంచకర్ల రమేష్కు కలిసొచ్చేలా ఉన్నాయి. ప్రస్తుత ఎమ్మెల్యే, వైకాపా అభ్యర్థి అదీప్రాజ్కు పార్టీ క్యాడర్ పరంగానూ సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కార్యకర్తలను, క్యాడర్ను సరిగా పట్టించుకోలేదు. గత ఐదేళ్లలో మండలానికో నాయకుడు అధికార పార్టీ తరఫున ఇష్టారాజ్యంగా వసూళ్లు చేశారు. ఇక్కడి పంచగ్రామాల భూ సమస్య పరిష్కారం కాలేదు. పరవాడ ఫార్మా కాలుష్యం వల్ల తాడి గ్రామం తరలింపు వ్యవహారమూ మూలనపడింది. ఇవన్నీ వైకాపా అభ్యర్థికి తీవ్ర ప్రతిబంధకాలుగా మారుతున్నాయి.
జగన్ కక్ష సాధింపులే... తెదేపాకు అదనపు బలం
నియోజకవర్గం: నర్సీపట్నం
కూటమి నుంచి తెదేపా అభ్యర్థిగా మాజీ మంత్రి, సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడు పోటీ పడుతున్నారు. చివరిసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. వైకాపా ప్రభుత్వం ఆయనపై పెట్టిన కేసులు, ఇబ్బంది పెట్టిన ఘటనలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనమయ్యాయి. జగన్ను నేరుగా విమర్శించడంతో ఆయనపై ప్రభుత్వం ఇలా కక్ష సాధించిందని మెజారిటీ ప్రజానీకం భావిస్తోంది. ఇది అయ్యన్నపాత్రుడికి ఎన్నికల్లో కలిసిరానుంది. వైకాపా నుంచి మళ్లీ బరిలో నిలిచిన ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్కు పరిస్థితి ఆశాజనకంగా లేదు. పార్టీ వ్యతిరేకత, చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు చేయకపోవడం, పాత తరం నాయకులను ఆకట్టుకోలేకపోవడం, సీనియర్ నేతలు పూర్తిగా వెంట నిలవకపోవడం ఈయనకు ప్రతిబంధకాలు. ఎమ్మెల్యే వెంట నడిచేవారిలో ప్రజాబలం లేని వారే ఎక్కువ. రెండు జిల్లాల్లో 77 గ్రామాలకు లబ్ధి కలిగించే తాండవ, ఏలేరు అనుసంధానం ప్రాజెక్టుకు పాలనామోదం వచ్చినా పనులు ప్రారంభం కాలేదు. నర్సీపట్నం పట్టణంలో ప్రధాన రహదారి విస్తరణ పనులు పూర్తి కాలేదు. నర్సీపట్నం మంచినీటి పథకం నిర్మాణాన్ని మధ్యలోనే ఆపివేయడమూ ప్రజలకు నచ్చలేదు. అయ్యన్నపాత్రుడు తెదేపా ద్వితీయశ్రేణి నాయకులను మరింత సమన్వయం చేసుకోవాల్సి ఉంది. కొన్ని మండలాల్లో వైకాపా నుంచి తెదేపాలోకి చేరికలు పెరిగాయి. అయ్యన్నపాత్రుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధి పనులూ కలిసిరావచ్చు.
కొణతాల వ్యక్తిత్వం అదనపు బలం
నియోజకవర్గం: అనకాపల్లి అసెంబ్లీ
జనసేన అభ్యర్థిగా బరిలో ఉన్న కొణతాల రామకృష్ణ మంత్రిగా, ఎంపీగా పని చేశారు. ఉత్తరాంధ్ర సమస్యలపై సుదీర్ఘ పోరాటాలు, విద్యావంతుడిగా, అభివృద్ధి పట్ల అంకితభావం ఉన్న నాయకుడిగా ఉన్న పేరు ఆయనకు ప్రధాన బలం. జనసేన పార్టీపై అభిమానం, తెలుగుదేశం, భాజపా బలం కలిసి నియోజకవర్గంలో పోటీని ఒక వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. ‘నేను వైకాపా అభిమానినే. కానీ కొణతాల రామకృష్ణకు ఓటేస్తా’ అని చెప్పిన వారూ ఉన్నారు. ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిత్వం ఆశించిన పీలా గోవింద్ ఈ స్థానాన్ని గెలిపించేందుకు ఎంతో కృషి చేస్తున్నారు. వైకాపా అభ్యర్థి మలసాల భరత్కుమార్కు రాజకీయ నేపథ్యం ఉన్నా తొలిసారి ఎన్నికల బరిలో నిలవడంతో ఆటుపోట్లు తప్పడం లేదు. పార్టీ క్యాడర్, కార్యకర్తల మద్దతుతో పాటు సొంత సామాజికవర్గం నుంచి సహకారం లభిస్తుందని ఆశిస్తున్నా ఆ విషయంలో అనుమానాలున్నాయి. ఇక్కడ వైకాపా నుంచి గెలిచి మంత్రిగా ఉన్న గుడివాడ అమర్నాథ్పై నెలకొన్న వ్యతిరేకత, ఆయన సామాజికవర్గంలో ఉన్న అసంతృప్తి భరత్ను ఇబ్బంది పెడుతున్నాయి.
అంది పుచ్చుకుంటే ‘విజయ’కుమారే!
నియోజకవర్గం: ఎలమంచిలి
తెదేపా, భాజపా మద్దతుతో జనసేన నుంచి సుందరపు విజయ్కుమార్ ఎన్నికల బరిలో నిలిచారు. పాత ఓట్ల చరిత్ర పరిశీలిస్తే ఈ కలయిక విజయంలో కీలకపాత్ర పోషించేలా ఉంది. వైకాపా నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే ఉప్పలపాటి రమణమూర్తిరాజు (కన్నబాబు) తిరిగి పోటీ చేస్తున్నారు. ఇక్కడ అధికార పార్టీలోని లుకలుకలతో కొందరు నాయకులు సహకరించడం లేదు. నియోజకవర్గంలో భూదందాలు, ఆక్రమణలు, ఇళ్ల పట్టాల పంపిణీలో అవకతవకలు, సమస్యలు పరిష్కరించకపోవడమే కాదు తన మాట తీరు కూడా కన్నబాబుకు ప్రధాన ప్రతిబంధకాలు. తెదేపా క్యాడర్, నాయకులను సుందరపు విజయకుమార్ మరింత అక్కున చేర్చుకుని ముందుకు కదిలితే ఆయన గెలుపు నల్లేరుపై నడకే. తెదేపా నుంచి అభ్యర్థిత్వం ఆశించిన ప్రగడ నాగేశ్వరరావు క్రియాశీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గంలో మంచినీటి సమస్య ఎక్కువ. వరాహ నది నుంచి రూ.100 కోట్లతో మంచినీటి పథకం నిర్మించేందుకు ఏర్పాట్లు చేసినా పనులు పూర్తి కాలేదు. వైకాపా అభ్యర్థి రమణమూర్తిరాజు పోల్ మేనేజ్మెంట్ నైపుణ్యమూ ఇక్కడి గెలుపోటములను ప్రభావితం చేస్తుంది.
హోరాహోరీ నుంచి.. తెదేపాకు బలం దిశగా!
నియోజకవర్గం: మాడుగుల
ఉప ముఖ్యమంత్రి, సిటింగ్ ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు లోక్సభ బరిలో నిలవడంతో ఆయన కుమార్తె అనురాధ ఇక్కడ వైకాపా అభ్యర్థిగా బరిలోకి దిగారు. ముత్యాలనాయుణ్ని ఎంపీ అభ్యర్థిగా పంపడంతో మాడుగుల అసెంబ్లీ సీటును పలువురు నేతలు ఆశించారు. ఆయన కుమార్తెకే అవకాశం ఇవ్వడంపై ఆశావహుల్లో అసంతృప్తి ఉంది. అనురాధకు రాజకీయ అనుభవం లేకపోవడం, పార్టీ క్యాడర్ పూర్తిగా కలిసి రాకపోవడం, ముత్యాలనాయుడి కుమారుడు రవికుమార్ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడం వైకాపాకు ప్రతిబంధకాలుగా మారాయి. కూటమి నుంచి తెదేపా అభ్యర్థిగా చివర్లో బండారు సత్యనారాయణమూర్తి బరిలోకి వచ్చారు. తొలుత పైలా ప్రసాదరావుకు అభ్యర్థిత్వం దక్కింది. తెదేపా అభ్యర్థిత్వం ఆశించిన రామానాయుడు సైతం నామినేషన్ వేశారు. వారిద్దరినీ ఒప్పించి పోటీ నుంచి తప్పించారు. ఇక్కడ నాయకులందరినీ సమన్వయం చేసే బాధ్యత లోక్సభ భాజపా అభ్యర్థి సీఎం రమేష్ తీసుకున్నారు. నియోజకవర్గంలో భూఆక్రమణలు, అవినీతి అక్రమాలు అధికార పార్టీకి ప్రతిబంధకం కానున్నాయి. దేవస్థానం భూముల ఆక్రమణలూ కీలకాంశమయ్యాయి. నియోజకవర్గంలో అనేక నీటిపారుదల ప్రాజెక్టులు పెండింగులోనే ఉన్నాయి. ప్రస్తుతం రెండు పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా ఉంది. క్రమేణా కూటమి బలం పుంజుకుంటోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
దేశ ప్రజలే నా వారసులు - విపక్షాలపై మండిపడ్డ మోదీ
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
-
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
-
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?