ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని కూటమి ప్రకటించింది.
ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
బీపీ, షుగర్ బాధితులకు ఉచిత మందులు
అందుబాటులోకి ఉచిత ఇసుక
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
ప్రజా రాజధానిగా అమరావతి
రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల
ఈనాడు - అమరావతి
- డ్వాక్రా సంఘాలకు రూ.10 లక్షల వడ్డీ లేని రుణం
- బీసీలకు రూ.5 వేల కోట్లతో ఆదరణ.. వారి రక్షణకు ప్రత్యేక చట్టం
- స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు
- పూజారులకు రూ.15 వేలు
- ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేలు
- మద్యం ధరల నియంత్రణ.. విషపూరిత బ్రాండ్ల రద్దు
- హజ్ యాత్రకు వెళ్లే ముస్లింలకు రూ.లక్ష ఆర్థిక సాయం
- బ్యాడ్జి ఉన్న డ్రైవరన్నకు రూ.15 వేలు.. జరిమానా, హరితపన్ను భారం తగ్గింపు
- వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేలు
- రైతులకు ఐదేళ్లలో రూ.లక్ష.. 90% రాయితీపై బిందు సేద్యం
- రాయితీపై వ్యవసాయ యంత్ర పరికరాలు
- ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు.. మెరుగైన పీఆర్సీ, ఐఆర్
- ఆస్తి పన్ను సమీక్ష.. చెత్తపన్ను రద్దు.. డీజిల్, పెట్రోలు ధరల నియంత్రణ
- గ్రామాల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు రహదారుల నిర్మాణం
- గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. 100 రోజుల్లో కట్టడి
సూపర్ సిక్స్ 2.0 షణ్ముఖ వ్యూహం
- ఇంటింటికీ రక్షిత తాగునీరు: ప్రతి ఇంటికీ కుళాయి కనెక్షన్
- పూర్ టు రిచ్: పేదలను సంపన్నులను చేసే దిశగా ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజా, భాగస్వామ్యం (పీ4) పథకాలు
- సౌభాగ్యపథం: చిన్న మధ్య తరహా పరిశ్రమలు, అంకుర సంస్థలకు ప్రాజెక్టు వ్యయంలో గరిష్ఠంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ
- ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాన్ని కొనసాగిస్తూ అన్ని ప్రాంతాల అభివృద్ధి
- రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య గణన చేపట్టి తద్వారా ప్రజల నైపుణ్య స్థాయి పెంపు
రాష్ట్రంలో సంపద సృష్టించి పేదలకు పంచుతాం. వైకాపా ప్రభుత్వం అమలు చేసిన రూ.10 ఇచ్చి ప్రజల నుంచి రూ.100 లాక్కునే విధానానికి స్వస్తి పలుకుతాం.
చంద్రబాబు
రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ.. రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మ్యానిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం.
పవన్కల్యాణ్
తెదేపా, జనసేన రూపొందించిన ఉమ్మడి మ్యానిఫెస్టోకు భాజపా సంపూర్ణ మద్దతు ఇస్తుంది.
సిద్ధార్థనాథ్ సింగ్
ఒక్క రూపాయి కూడా కట్టే పని లేకుండానే.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పించే పథకాన్ని దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తామని కూటమి ప్రకటించింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 ఏళ్లకే రూ.4 వేల పింఛను అందజేస్తామని.. మత్స్యకారులకు వేట విరామ సమయంలో రూ.20 వేలు, ఆటో, ట్యాక్సీ, లారీ, టిప్పర్ డ్రైవర్లకు రూ.15 వేల ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చింది. ఇసుకను ఉచితంగా అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. తెదేపా, జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టోను మంగళవారం ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతలు విడుదల చేశారు. మిత్రపక్షం భాజపా సూచనలు, సలహాలతో దీన్ని రూపొందించారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, భాజపా రాష్ట్ర ఎన్నికల సహ ఇన్ఛార్జి సిద్ధార్థ్నాథ్ సింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
విశాల హితం.. సంక్షేమ పథం
తెదేపా-జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో
ఈనాడు అమరావతి
ప్రగతి, సంక్షేమం సమ్మిళితంగా రూపొందించిన తెదేపా-జనసేన సంయుక్త మ్యానిఫెస్టో కాంతిపుంజాలను వెదజల్లుతోంది. అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు ఆశలు, ఆంకాక్షలకు దర్పణం పట్టింది. వచ్చే అయిదేళ్లపాటు రాష్ట్రాన్ని ప్రగతి బాటలో అగ్రస్థానంలో నిలిపే దిశగా ఈ మ్యానిఫెస్టో మార్గదర్శనం చేయనుంది.
ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
- జిల్లాల వారీగా వర్గీకరణ అమలు
- ఎస్సీ, ఎస్టీలకు 50 ఏళ్లకే పింఛన్ మంజూరు
- సబ్ప్లాన్ నిధులు వారి అభివృద్ధికే ఖర్చు
- ఏజెన్సీల్లో ఆదివాసీ ఉపాధ్యాయుల నియామకం జీవో 3 పునరుద్ధరణ
- ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పథకాల పునరుద్ధరణ
- డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, మంత్రూబాయ్, డాక్టర్ అచ్చెన్న తదితరుల హత్యలకు కారకులైన వారికి కోర్టుల్లో శిక్షలు పడేలా చర్యలు
- ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ
స్థానిక పాలనకు ఊతం.. ఆర్థిక సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే
- ఆర్థిక సంఘం నిధులు.. నేరుగా పంచాయతీలకే అందజేత
- పంచాయతీరాజ్ వ్యవస్థకు పూర్వవైభవం.. స్థానిక పాలనకు ఊతం
- పంచాయతీరాజ్ వ్యవస్థ ద్వారా అభివృద్ధికి ఒక విజన్ ఏర్పాటు
- పంచాయతీరాజ్ ప్రాజెక్టు ప్రతిపాదనల కోసం బడ్జెట్లో 5 శాతం కేటాయింపు.. ఐదేళ్లలో 10 శాతం వరకు పెంపు
- సర్పంచ్ల నుంచి జడ్పీ ఛైర్మన్ల వరకు స్థానిక ప్రజాప్రతినిధులకు గౌరవ వేతనం పెంపు
విశాఖ కేంద్రంగా రైల్వేజోన్.. ఆర్థిక రాజధానిగా అభివృద్ధి
- ఆర్థిక రాజధానిగా విశాఖ అభివృద్ధి
- వైజాగ్-చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్తో ప్రధాన ప్రాంతాలను అనుసంధానం చేసి పారిశ్రామికీకరణకు బాటలు
- విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు. అవసరమైన, అనువైన భూమిని వెంటనే కేటాయించి జోన్ సాకారానికి చర్యలు
- విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణకు చర్యలు
- భోగాపురం విమానాశ్రయం త్వరితగతిన నిర్మాణం.. ఉత్తరాంధ్రలోని ప్రధాన పోర్టుల నిర్మాణం పూర్తి
- ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, నాగావళి-వంశధార నదుల అనుసంధానం, తోటపల్లి రిజర్వాయర్ ఆధునీకరణ సత్వరం పూర్తి చేసేందుకు చర్యలు
- జీడిమామిడి, కొబ్బరి ధరల స్థిరీకరణ కోసం చర్యలు
- కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ నిర్మాణానికి చర్యలు
రాయలసీమకు తాగునీరు.. ఆటోమొబైల్ హబ్
- తాగునీరు, సాగునీరు, విద్య, వైద్య సదుపాయాల ఏర్పాటుకు ప్రాధాన్యం
- హార్టీకల్చర్ హబ్గా, విత్తన రాజధానిగా రాయలసీమ
- కర్నూలులో తక్షణ హైకోర్టు బెంచ్ ఏర్పాటు
- కియా, ఇసుజు లాంటి పరిశ్రమలు మరిన్ని తీసుకొచ్చి ఆటోమొబైల్ హబ్గా రాయలసీమ అభివృద్ధి
- చెన్నై-బెంగుళూరు ఇండస్టియ్రల్ కారిడార్ను రాయలసీమలోని కీలక పట్టణాలకు అనుసంధానం చేస్తూ ఇండస్టియ్రల్ క్లస్టర్గా తీర్చిదిద్దే చర్యలు
- యువగళం యాత్రలో ప్రకటించిన ‘మిషన్ రాయలసీమ’ అమలుకు చర్యలు
ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
- పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి
- గాలేరు-నగరి, హంద్రీ-నీవా, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, తోటపల్లి రిజర్వాయర్, వంశధార-నాగావళి నదుల అనుసంధానం వంటి ప్రాజెక్టుల శీఘ్రతర నిర్మాణానికి చర్యలు
- రాష్ట్రంలోని నదుల అనుసంధానం- ప్రతి ఎకరాకు నీరు
- రాయలసీమ, ఉత్తరాంధ్ర పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి
మౌలిక వసతుల కల్పన
- గ్రామాల నుంచి మండల, జిల్లా కేంద్రాలకు రోడ్ల నిర్మాణం
- సోషల్ ఇన్ఫ్రాస్టక్చ్రర్ అభివృద్ధి
- పోర్టులు, ఎయిర్పోర్టులు, రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన నిర్మాణం
- వర్క్ ఫ్రం హోం కోసం జిల్లా, మండల కేంద్రాల్లో వర్క్ స్టేషన్ల ఏర్పాటు
- ప్రతి ఇంటికీ రక్షిత మంచినీటి సరఫరా
- అమరావతి పునర్నిర్మాణానికి చర్యలు.. ఆర్థిక ప్రగతికి చేయూత
- ఇంటి పైకప్పుపై సౌరవిద్యుత్ ఉత్పత్తి పథకం.. విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు.. అదనపు విద్యుత్ కొనుగోలు
- ఉచిత ఇసుక విధానం అమలు
- చెత్త పన్ను రద్దు, ఇంటి పన్నుల సమీక్ష
- పెట్రోల్, డీజిల్ ధరల నియంత్రణ.
- మద్యం ధరల నియంత్రణ, విషపూరిత మద్యం బ్రాండ్ల రద్దు
- గంజాయి, డ్రగ్స్ మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం.. 100 రోజుల్లో కట్టడి
- అన్న క్యాంటీన్ల ఏర్పాటు/డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పేదల ఆకలి తీర్చే చర్యలు
- రేషన్ పంపిణీ విధానాన్ని సమీక్షించి, పౌరసరఫరాల వ్యవస్థ పటిష్ఠతకు చర్యలు
- పండుగ కానుకలు, పెళ్లి కానుకల పునరుద్ధరణ
రాయితీపై సోలార్ పంపుసెట్లు..
- రైతులకు 9 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు సరఫరా
- రాయితీపై సోలార్ పంపుసెట్లు, మిగిలిన విద్యుత్ ప్రభుత్వం కొనుగోలు
- సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు
- ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
- కౌలురైతులకు గుర్తింపుకార్డులు, అన్ని సంక్షేమ పథకాల అందజేత.. పంటల బీమా వర్తింపు
- రైతు కూలీలకు కార్పొరేషన్ స్థాపించి రాయితీలు, సంక్షేమ పథకాల అమలు
- ప్రతి లోక్సభ నియోజకవర్గంలో 1,000 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేపట్టి వారికి ఆర్థిక, సాగు, మార్కెటింగ్ అంశాల్లో తోడ్పాటు
- ప్రభుత్వ రంగంలో గిడ్డంగులు, శీతల గిడ్డంగుల యూనిట్ల ఆధునికీకరణ, నూతన యూనిట్ల ఏర్పాటు
- దళారుల దోపిడీని అరికట్టడానికి ఏపీఎంసీ చట్టం పటిష్ఠంగా అమలు
- బిందు సేద్యానికి 90 శాతం సబ్సిడీ
- రాష్ట్రంలో సెరికల్చర్కు ప్రోత్సాహం. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల కల్పన
వడ్డీలేని రుణం
- డ్వాక్రా సంఘాలకు వడ్డీ లేని రుణాలు రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పెంపు
- ప్రత్యేక పథకం ద్వారా పి4 మోడల్లో మహిళల ఆర్థికాభివృద్ధికి చర్యలు
- అంగన్వాడీ కార్యక్రమాలకు సుప్రీంకోర్టు తీర్పు మేరకు గ్రాట్యుటీ చెల్లింపు.. ఆశా వర్కర్లకు కనీస వేతనం పెంపు దిశగా చర్యలు
- ఉద్యోగాలు చేసే మహిళలకు హాస్టల్ వసతి కల్పన
- విద్యార్థినులకు ‘కలలకు రెక్కలు’ పథకం ద్వారా రుణాలు
- బీసీలకు 50 ఏళ్లకే నెలకు 4 వేల పింఛన్
- బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
- బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఐదేళ్లలో రూ.లక్షన్నర కోట్ల ఖర్చు
- స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34% రిజర్వేషన్లు
- చట్టసభల్లో బీసీలకు 33% రిజర్వేషన్ల కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపే చర్యలు
- తక్కువ జనాభాతో, ఎన్నికల్లో పోటీ చేయలేని వర్గాలకు నామినేషన్ల ద్వారా రాజకీయ భాగస్వామ్యం
- బీసీల ఆర్థికాభివృద్ధి, ఉపాధికి ప్రోత్సాహకాల పునరుద్ధరణ
- దామాషా ప్రకారం రిజర్వేషన్లకు నిధులు
- శాశ్వత కులధ్రువీకరణ పత్రాలు
- స్వయం ఉపాధికి రూ.10 వేల కోట్ల ఖర్చు
- రూ.5,000 కోట్లతో ఆదరణ పథకం పునరుద్ధరణ
- తోట చంద్రయ్య, అమర్నాథ్గౌడ్, జల్లయ్య యాదవ్, పాల సుబ్బారావు లాంటి బీసీలను హత్య చేసిన వైకాపా గూండాలకు శిక్ష పడేలా చర్యలు
ఒకటో తేదీనే జీతాలు
- ఉద్యోగులు, ఉపాధ్యాయుల గౌరవాన్ని పునఃప్రతిష్ఠించి పూర్తి అనుకూల వాతావరణంలో వారు పని చేసేలా చర్యలు
- సీపీఎస్/జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి
- ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు. అలవెన్స్, పేమెంట్స్పైనా పునఃపరిశీలన. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటన
- రాష్ట్రంలో ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్ల చెల్లింపు. వీరికి రావలసిన బకాయిలు చెల్లింపునకు ఏర్పాట్లు. పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు
- తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాల వర్తింపు
డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు.. 5% వడ్డీపై రూ.4 లక్షల రుణం
డ్రైవర్ సాధికార సంస్థ ఏర్పాటు చేసి అన్ని వర్గాల డ్రైవర్లకు ప్రమాద బీమా, హెల్త్ ఇన్సూరెన్స్, విద్యా రుణాలు వంటి సంక్షేమ కార్యక్రమాల అమలు.. డ్రైవర్లను యజమానులను చేసే లక్ష్యంతో వాహనాల కొనుగోళ్లకు 5% వడ్డీపై రూ.4 లక్షల రుణం
- బ్యాడ్జ్ కలిగిన ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు, హెవీ లైసెన్స్ కలిగిన లారీ, టిప్పర్ డ్రైవర్లకు ఏటా రూ.15 వేల ఆర్థిక సాయం
- జీవో 21 రద్దు చేసి ఫైన్ల భారం తగ్గింపు
- వాహనాలపై పెంచిన హరిత పన్ను తగ్గింపు
- అసంఘటిత రంగ కార్మికులు: చంద్రన్న బీమా పునరుద్ధరణ అసంఘటిత కార్మికులందరికీ వర్తింపు
- భవన నిర్మాణ బోర్డు పునరుద్ధరణ
- ముఠా కార్మికుల సంక్షేమానికి ప్రత్యేక బోర్డు
ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- దేశంలోనే తొలిసారిగా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ కార్డులు
- అన్ని మండల కేంద్రాల్లో జన ఔషధ కేంద్రాల ఏర్పాటు
- బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలకు ఉచితంగా జనరిక్ మందులు
పీజీ విద్యార్థులకు కాలేజీలకే చెల్లింపు
- ఎయిడెడ్ కళాశాలలు, ప్రైవేట్ పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పునరుద్ధరణ
- కాలేజీలకే రుసుము చెల్లించి విద్యార్థులకు సర్టిఫికెట్ చిక్కులు లేకుండా చర్యలు
- సామాన్యులకు ఇసుక అందుబాటులో ఉండేలా సమగ్ర ఇసుక విధానం
అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
- కేజీ టు పీజీ సిలబస్పై సమీక్ష
- రాష్ట్రంలో అనేక స్కూళ్లు మూతపడటానికి కారణమైన జీవో 117 రద్దు, మూతపడిన పాఠశాలల పునఃప్రారంభం
- డాక్డర్ అంబేడ్కర్ విదేశీ విద్య పథకం పునరుద్ధరణ
పాడి రైతుకు గోకులాలు.. రాయితీ మందులు
- పశువుల కొనుగోళ్లు, దాణా, మందుల కొనుగోళ్లపై సబ్సిడీలు, బీమా సౌకర్యం
- గోకులాల ఏర్పాటు- మేత కోసం బంజరు భూముల కేటాయింపు
- గోపాలమిత్రల పునర్నియామకం దిశగా చర్యలు
సాధికారతకు రూ.15 వేల కోట్లు
- ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలకు అదనంగా కాపుల సంక్షేమం కోసం రానున్న ఐదేళ్లలో రూ.15 వేల కోట్లు కేటాయించి, వారి సాధికారత, అభివృద్ధి కోసం చర్యలు
- కాపు యువత, మహిళల నైపుణ్యాభివృద్ధికి, స్వయం ఉపాధికి ప్రాధాన్యం
- కాపు భవనాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి
- ప్రతి చేనేత కుటుంబానికి ఏటా రూ.24 వేల ఆర్థిక సాయం
- చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ తిరిగి చెల్లింపు
- పవర్ లూమ్లకు 500 యూనిట్లు, హ్యాండ్లూమ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం
- గృహ నిర్మాణానికి పట్టణాల్లో 2, గ్రామాల్లో 3 సెంట్ల స్థలం మంజూరు
- ఇప్పటి వరకు స్థలం మంజూరైనా పట్టాలు పొందని వారికి ప్రభుత్వం తరఫున పక్కా ఇళ్ల నిర్మాణాల పూర్తి
జూనియర్ న్యాయవాదులకు శిక్షణ అకాడమీ
- న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉచిత న్యాయ సేవల అందుబాటుకు లీగల్ కియోస్క్ల స్థాపన, జూనియర్ న్యాయవాదులకు ప్రభుత్వ స్టైఫండ్ నెలకు రూ.10 వేలు, జూనియర్ న్యాయవాదుల శిక్షణకు ప్రత్యేక ట్రైనింగ్ అకాడమీ ఏర్పాటు
- అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు అందేలా చర్యలు
మాజీ సైనికులకు ప్రత్యేక కార్పొరేషన్
ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి మాజీ సైనికుల సంక్షేమానికి, సమస్యల పరిష్కారానికి కృషి
యువతకు ఏటా జాబ్ క్యాలెండర్
ప్రత్యేక ఎంప్లాయ్మెంట్ జోన్లు
- మెగా డీఎస్సీ, ఏటా జాబ్ క్యాలెండర్
- ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి. ఉద్యోగ కల్పనకు ప్రత్యేక ఎంప్లాయిమెంట్ జోన్ల ఏర్పాటు
- ఉద్యోగ కల్పన చేసే ఎంఎస్ఎంఈ రంగానికి ప్రోత్సాహకాలు
- మూతపడిన ప్రతి నైపుణ్య శిక్షణ కేంద్రం పునఃప్రారంభం, విస్తరణ
- పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా యువతకు నైపుణ్య శిక్షణ, ఉద్యోగాల కల్పన
- ప్రపంచ స్థాయి క్రీడా మౌలిక సదుపాయాల అభివృద్ధి.. రాష్ట్ర యువతను అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక. భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలకు వేదికగా రాష్ట్రం
- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పరీక్షలకు సన్నద్ధత కోసం డిజిటల్ ల్రైబరీల స్థాపన
- ఎన్డీయే ప్రభుత్వం తెచ్చిన 10% రిజర్వేషన్ల అమలు. ఐదేళ్లకోసారి ఆర్థిక సర్వే చేసి రిజర్వేషన్ల అమలు
బ్రాండ్ ఏపీ పునరుద్ధరణ
- ఐదేళ్లుగా విధ్వంసానికి గురైన బ్రాండ్ ఏపీని పునఃప్రతిష్ఠించి, భారీ స్థాయిలో దేశ విదేశీ పెట్టుబడులను ఆకర్షించి పరిశ్రమల ఏర్పాటు ద్వారా రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం.. ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు ఊతం.. కొత్త పారిశ్రామిక విధానం కింద పూర్తిస్థాయిలో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వంటి ఆధునిక, సాంకేతిక విజ్ఞానం వినియోగానికి ప్రోత్సాహం
- రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వైల్డ్ లైఫ్, అడ్వెంచర్, హెరిటేజ్, ఎకో, టెంపుల్ టూరిజం సర్క్యూట్ల ఏర్పాటు.. ఉపాధి కల్పనకు ప్రోత్సాహం
- వ్యవసాయ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల స్థాపనకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిచ్చి రైతుల ఆదాయం పెంచడంతోపాటు స్వయం ఉపాధి, ఉపాధి కల్పనకు ప్రోత్సాహం
- గత ఐదేళ్లుగా విధ్వంసమైన వ్యవస్థలను పటిష్ఠపరిచి సుపరిపాలన అందజేత
- ఐదేళ్లలో క్షీణించిన శాంతిభద్రతల పునరుద్ధరణ. శాంతిభద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం
అర్చకులకు రూ.15 వేల కనీస వేతనం
- హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు హిందూ ఎండోమెంట్ బోర్డు ఏర్పాటు
- ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనం
- వార్షికాదాయం రూ.50 వేలకు పైన ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు కనీస వేతనం రూ.15 వేలకు పెంపు. వార్షికాదాయం రూ.50 వేలకు తక్కువ ఉన్న ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు ధూప, దీప, నైవేద్యం కింద ఇచ్చే మొత్తం నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
- వైదిక, ఆగమశాస్త్ర సంబంధ విషయాల్లో ఆయా ఆలయాలకు పూర్తి స్వతంత్ర ప్రతిపత్తి
- తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల పవిత్రతకు మూలాధారాలైన వేయి కాళ్ల మండపం వంటి చారిత్రక కట్టడాల పునరుద్ధరణ
- దేవాలయాలకు పూర్తి రక్షణ, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై జరిగిన దాడులకు బాధ్యులైన వారికి శిక్షపడేలా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు
- పురోహితులు, వంట బ్రాహ్మణులకు కులవృత్తిదారులుగా గుర్తింపు
- బ్రాహ్మణ కార్పొరేషన్, బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బలోపేతం
- తిరుపతి సహా అన్ని దేవాలయాల్లో పూజారితోపాటు ఒక బ్రాహ్మణుడికి ట్రస్ట్ బోర్డు సభ్యత్వం
- బ్రాహ్మణులు అపరకర్మలు చేసుకోవడానికి ప్రతి నియోజకవర్గంలో ఒక భవనం
- వేదవిద్యను అభ్యసించిన నిరుద్యోగులకు ‘యువగళం’ కింద రూ.3 వేల నిరుద్యోగభృతి
ఇమాంలకు ప్రతి నెలా రూ.10 వేలు.. రూ.100 కోట్లతో నూర్బాషా కార్పొరేషన్
- ముస్లిం, మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛన్
- మైనారిటీలకు ముఖ్య పట్టణాల్లో ఈద్గాలకు, ఖబరస్తాన్లకు స్థలాల కేటాయింపు. విజయవాడ సమీపంలో హజ్హౌస్ నిర్మాణం
- నూర్బాషా కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రతి ఏటా రూ.100 కోట్ల కేటాయింపు. మైనారిటీ కార్పొరేషన్ ద్వారా రూ.5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు
- ఇమామ్లకు ప్రతి నెలా రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేల గౌరవవేతనం
- అర్హత కలిగిన ఇమామ్లను ప్రభుత్వ ఖాజీలుగా నియామకం
- మసీదు నిర్వహణకు ప్రతి నెల రూ.5 వేల ఆర్థిక సహాయం, హజ్ యాత్రకు వెళ్లే ఒక్కో ముస్లింకు రూ.లక్ష సహాయం
మిషనరీ ఆస్తుల అభివృద్ధికి బోర్డు
- క్రిస్టియన్ మిషనరీల ఆస్తుల అభివృద్ధి బోర్డు ఏర్పాటు
- చర్చిల నిర్మాణం, పునరుద్ధరణకు ఆర్థిక సహాయం
- శ్మశానవాటికలకు స్థలం కేటాయింపు
- జెరూసలెం యాత్రికులకు సహాయం
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు
- ల్యాండ్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ
చంద్రన్న బీమా పథకం
- సహజ మరణానికి రూ.5 లక్షలు, ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.10 లక్షల బీమా సౌకర్యం
- అవసరమున్న జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు
- అన్ని జోన్లలో ఉన్న ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50కే సరఫరా
- ట్రాన్స్ఫార్మర్ల ధరల తగ్గింపు, సబ్సిడీపై ఏరియేటర్లు
జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం
- అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు
- అక్రిడేషన్ కార్డులు కలిగిన ప్రతి జర్నలిస్టుకు ఉచిత నివాస స్థలం
పింఛన్లు రూ.4 వేలకు పెంపు..
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు
- పింఛన్లు రూ.3 వేల నుంచి రూ.4 వేలకు పెంపు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి అమలు
- దివ్యాంగులకు పింఛన్ రూ.6 వేలకు పెంపు
- కిడ్నీ, తలసీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10 వేల పింఛన్
యాదవ, కురుబలకు గొర్రెల పెంపకం యూనిట్లు
- అత్యాధునిక ప్రమాణాలతో గొర్రెల పెంపకం యూనిట్ల స్థాపనకు రాయితీలు
- గొర్రెలు, మేకల పెంపకం యూనిట్లకు బీమా సౌకర్యం
నాయీబ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవవేతనం
- దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రాహ్మణులకు రూ.25 వేల గౌరవ వేతనం
- సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు
గీత కార్మికులకు మద్యం దుకాణాలు
గీత కార్మికులకు మద్యం దుకాణాల్లో 10% కేటాయింపు
వడ్డెరలకు క్వారీల్లో 15%
క్వారీల్లో వడ్డెరలకు 15% రిజర్వేషన్.. రాయల్టీ, సీనరేజ్ ఛార్జీల్లో మినహాయింపు
రజకులకు ధోబీ ఘాట్లు.. విద్యుత్తు రాయితీ
రజకులకు ధోబీ ఘాట్ల నిర్మాణాలకు ప్రోత్సాహం, విద్యుత్తు ఛార్జీల రాయితీ
జీవో 217 రద్దు
సముద్రంలో వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ.20 వేల ఆర్థిక సాయం
జీవో 217 రద్దు చేస్తాం. బోట్ల మరమ్మతులు, ఆధునిక కమ్యూనికేషన్కు ఆర్థిక సాయం
వాలంటీర్లకు నెలకు రూ.10 వేలు
వాలంటీర్ల గౌరవ వేతనం నెలకు రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంపు
ఆర్యవైశ్య కార్పొరేషన్కు నిధులు
- ఆర్యవైశ్య కార్పొరేషన్కు తగు మేర నిధుల కేటాయింపు
- చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణ సౌలభ్యం
- అధికారిక కార్యక్రమంగా.. కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ నిర్వహణ
అమరావతిలో అల్లూరి పేరుతో స్మృతివనం
- భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు
- ప్రజా రాజధాని అమరావతిలో అల్లూరి సీతారామరాజు స్మృతివనం నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయింపు
కమ్మ, రెడ్డి, వెలమలకు సాధికారత
కమ్మ, రెడ్డి వెలమ, ఇతర అగ్రకుల కార్పొరేషన్లకు తగు విధంగా నిధులు కేటాయించి వారి సాధికారత, అభివృద్ధికి చర్యలు
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫలితాలను చూసి జగన్ షాక్ అవుతారు: దేవినేని ఉమా
ఎన్నికల ఫలితాలను చూసి సీఎం జగన్ షాక్ అవుతారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు జోస్యం చెప్పారు. -
తాడిపత్రిలో ఉంటే బయటకు రానివ్వం.. జేసీ తనయుడికి పోలీసుల హెచ్చరిక
అనంతపురం జిల్లా తాడిపత్రిలో తెదేపా నేతలు జేసీ దివాకర్రెడ్డి, జేసీ ప్రభాకర్రెడ్డి కుటుంబాలను లక్ష్యంగా చేసుకొని పోలీసులు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. -
తెదేపాకు ఓటేశారని వైకాపా మూకల దాడి
తెదేపాకు ఓటు వేశారన్న అక్కసుతో ఓ కుటుంబంపై బుధవారం వైకాపా మూకలు దాడికి తెగబడ్డాయి. ప్రశాంత విశాఖలో రెచ్చిపోయి రక్తపాతం సృష్టించాయి. -
తెదేపా ఏజెంట్లుగా కూర్చున్నందుకు ఇంటికెళ్లి పిల్లలపై దాడి
మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు ఎన్నికల సందర్భంగా సాగించిన దాష్టీకాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
హింసకు కొమ్ముకాసిన అధికారులపై వేటు
ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో చెలరేగిన హింసకు కొమ్ముకాసిన అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘం కొరడా ఝళిపించింది. ముగ్గురు ఎస్పీలు, ఒక జిల్లా కలెక్టర్ను బాధ్యులుగా నిర్ణయిస్తూ రాష్ట్రప్రభుత్వం ఇచ్చిన నివేదికపై తీవ్రస్థాయిలో స్పందించింది. -
విధ్వంసానికి వైకాపా కుట్ర!
పల్నాడు జిల్లాలో భారీ విధ్వంసానికి వైకాపా మూకలు కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల రోజు, అనంతరం జరిగిన పరిణామాలే అందుకు నిదర్శనం. -
ఓటు కోసం నాలుగు నుంచి ఆరున్నర గంటలు క్యూ లైన్లో ఉండాలా?
ఓటు వేయడమంటే పండగ... కానీ ఈ ప్రజాస్వామ్య పర్వాన్ని ఓటర్ల సహనానికి, ఓర్పునకు పరీక్షగా మార్చేసిన ఘనత ఎన్నికల సంఘానికే దక్కింది. ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా, సులువుగా ఓటు వేసేందుకు తగిన ఏర్పాట్లు, సదుపాయాలు కల్పించాల్సిన ఎన్నికల సంఘం... ఓటు వేయడానికి ఇంతగా నరకం అనుభవించాలా అనే భావనను కలిగించింది. -
దుర్మార్గంగా దాడులు చేస్తోంది కాక.. మాపై తప్పుడు కథనాలా?
పోలింగ్ సమయంలో, అనంతరం వైకాపా శ్రేణులు పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలకు పాల్పడ్డా.. సాక్షి, వైకాపా అనుకూల మీడియాలో మాత్రం ప్రతిపక్షాలపై బురదజల్లుతూ తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని తెదేపా సీనియర్ నేత, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. -
వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం
ఏపీలో వైకాపా గూండాలను అదుపు చేయడంలో పోలీసుల వైఫల్యం వల్లే పోలింగ్ అనంతరం పెద్ద ఎత్తున హింసాత్మక ఘటనలు చెలరేగుతున్నాయని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
‘ఈ-ఆఫీస్’ అప్గ్రేడ్ నిలిపివేయండి
గ్రామ, వార్డు సచివాలయాలకు ‘ఈ-ఆఫీస్’ను విస్తరించడం, ప్రస్తుతం వాడుకలో ఉన్న వెర్షన్ను అప్గ్రేడ్ చేసే పేరుతో వైకాపా ప్రభుత్వం పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతోందని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. -
ప్రజలు చూపించిన ప్రేమకు కృతజ్ఞతలు
గతంలో ఎన్నడూ లేనంతగా 81.86 శాతం మంది తెలుగు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోవడం ఆనందాన్ని కలిగించిందని జనసేన అధినేత పవన్కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. -
గతం కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తున్నాం
‘రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో 175కి 151 అసెంబ్లీ స్థానాల్లో, 25కి 22 లోక్సభ సీట్లలో వైకాపా గెలిచింది. ఈ ఎన్నికల్లో ఆ రికార్డును బ్రేక్ చేయబోతున్నాం. -
ఎస్సై, పోలీసులపై వైకాపా మూకల దాడి
వైకాపా మూకల అరాచకానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది. ప్రతిపక్ష కార్యకర్తలతో పాటు అడ్డుచెప్పిన పోలీసులను సైతం వదలకుండా దాడులకు తెగబడుతున్నారు. -
పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో 13 మంది అరెస్టు
తిరుపతి జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నానిపై జరిగిన హత్యాయత్నం కేసులో 13 మంది నిందితులను గురువారం అరెస్టుచేశారు. -
పెనమలూరు తెదేపా అభ్యర్థి బోడే, అనుచరులపై కేసు
ఎన్నికల నేపథ్యంలో కృష్ణా జిల్లా పోరంకిలో జరిగిన ఘర్షణలపై మరో కేసు నమోదైంది. ఇప్పటికే మంత్రి జోగి రమేష్, ఆయన కుమారులు, అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాసుల కక్కుర్తితో పేదల సొమ్మును దారి మళ్లించాలని చూస్తారా?
కాసుల కక్కుర్తితోనే సంక్షేమ పథకాల అమలు కోసం ఉంచిన రూ.14 వేల కోట్ల నిధుల్ని వైకాపా అనుకూల గుత్తేదార్లకు దోచిపెట్టాలని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి జవహర్రెడ్డి చూస్తున్నారని మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ధ్వజమెత్తారు. -
తాడిపత్రి అల్లర్లలో 91 మంది అరెస్టు
పోలింగ్ తర్వాత రోజు అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్ల ఘటనలో పోలీసులు 91 మందిని అరెస్టు చేశారు. గురువారం వారిని ఉరవకొండ న్యాయస్థానంలో హాజరుపర్చగా జడ్జి 14 రోజుల రిమాండు విధించారు. -
కౌంటింగ్కు ఏజెంట్లు రారని జగన్ భయం: లంకా దినకర్
ఓట్ల లెక్కింపురోజు ఏజెంట్లు కూడా కరవవుతారన్న భయంతోనే ఎన్నికల్లో గెలుస్తామని ముఖ్యమంత్రి జగన్ చెబుతున్నారని భాజపా ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ విమర్శించారు. -
అనర్హత వేటు వేయడం కక్ష సాధింపే
శాసనమండలి సభ్యుడిగా ఉన్న తనపై ఛైర్మన్ అనర్హత వేటు వేయడం ముమ్మాటికీ వైకాపా కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని తెదేపా నేత జంగా కృష్ణమూర్తి విమర్శించారు. -
ఎన్నికల పరిశీలకుడు దీపక్ మిశ్ర అండతోనే తెదేపాకు అనుకూలంగా పోలీసులు వ్యవహరించారు
‘రాష్ట్రంలో నిష్పాక్షిక, స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకోసం ప్రత్యేక పరిశీలకుడిగా కేంద్ర ఎన్నికల సంఘం తనకు అప్పగించిన బాధ్యతను దీపక్ మిశ్ర విస్మరించారు. -
ఆ అధికారుల వైఫల్యం వల్లే హింసాకాండ
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి గురువారం నివేదిక ఇచ్చారు.
తాజా వార్తలు
-
పిన్నెల్లి ఏ తప్పూ చేయకపోతే ఎందుకు పారిపోయారు?: జూలకంటి బ్రహ్మారెడ్డి
-
లేజర్ బీమ్.. ఖమేనీ కుమారుడి హస్తం: రైసీ మరణంపై ప్రచారంలోకి కుట్రకోణాలు
-
‘కనీసం ఓటు వేయాలని అనిపించలేదా’.. తమ ఎంపీకి భాజపా షోకాజ్ నోటీసులు
-
‘ఫ్యామిలీస్టార్’కు నెగెటివ్ టాక్ ఇలా క్రియేట్ చేశారు: ఆనంద్ దేవరకొండ
-
నోరుజారి ఇరకాటంలో పడి.. ఉపవాసానికి సిద్ధమై: వివాదం వేళ భాజపా నేత పోస్టు
-
అట్టహాసంగా నియామక పత్రాలిచ్చారు.. 4 నెలలుగా జీతాలివ్వలేదు: హరీశ్రావు