చిన్నారులకు ‘కొవావాక్స్’ విడుదల అప్పుడే.. అధర్ పూనావాలా
చిన్నారుల్లో కొవిడ్ కట్టడికి అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్ రూపొందించిన ‘కొవావాక్స్’ టీకా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో భారత్లో విడుదలయ్యే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాల ఆశాభావం వ్యక్తం
దిల్లీ: చిన్నారుల్లో కొవిడ్ కట్టడికి అమెరికాకు చెందిన ఫార్మా సంస్థ నోవావాక్స్ రూపొందించిన ‘కొవావాక్స్’ టీకా వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో భారత్లో విడుదలయ్యే అవకాశం ఉందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు. 18 ఏళ్లు ఆపైవారి కోసం తయారు చేసిన వ్యాక్సిన్ ఈ ఏడాది అక్టోబరులోనే వచ్చే అవకాశం ఉందన్నారు. భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అనుమతులపై వాటి విడుదల ఆధారపడి ఉందని తెలిపారు. శుక్రవారం ఆయన పార్లమెంట్ ప్రాంగణంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
కొవావాక్స్ టీకా రెండు డోసుల్లో వేస్తారని, దేశంలో విడుదలయ్యే సమయంలో ధర ఖరారయ్యే అవకాశం ఉందని అధర్ తెలిపారు. టీకాల ఉత్పత్తి, ఆర్థిక తోడ్పాటు విషయంలో కేంద్రం అండగా ఉందని, ఈ విషయంలో మద్దతుగా నిలుస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు చెప్పారు. వైరస్ కట్డడిలో కొవావాక్స్ 100 శాతం ప్రభావవంతంగా ఉందని, 90.4 శాతం పనితీరు కనబర్చుతోందని నోవావాక్స్ గతంలో ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతానికి దేశంలో 18 ఏళ్లు, ఆపై వారికి టీకా వేస్తున్నారు. చిన్నారులకు వ్యాక్సినేషన్ ఈ నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం