కరోనా టీకాతో ‘ఆ’ సమస్య? నిజానిజాలివే..!
టీకాలు తీసుకోవడం వల్ల నపుంసకత్వం.. వట్టి పుకార్లంటూ డీసీజీఐ స్పష్టం చేసింది.
దిల్లీ: కరోనా వైరస్కు సంబంధించి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన ‘కొవాగ్జిన్’, సీరం ఇన్స్టిట్యూట్కు చెందిన ‘కొవిషీల్డ్’ టీకాల అత్యవసర వినియోగానికి ఔషధ నియంత్రణ సంస్థ (డీసీజీఐ) అనుమతులను జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనితో ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమానికి మనదేశంలో మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో కొవిడ్ టీకాలు తీసుకోవడం వల్ల నపుంసకత్వం తలెత్తుతుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇవన్నీ వట్టి పుకార్లంటూ డీసీజీఐ స్పష్టం చేసింది.
వ్యాక్సిన్ పనితీరుకు సంబంధించి ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. ‘‘కొవిడ్ టీకాల్లో హానికరమైన పదార్థాలు ఉండవచ్చు. ప్రజలను చంపి జనాభాను తగ్గించేందుకు ఈ వ్యాక్సిన్ను ఇచ్చారని భవిష్యత్తులో తెలియవచ్చు. దీనివల్ల ప్రజలు నపుంసకులు కావచ్చు. లేదా ఏమైనా జరగచ్చు’’ అని ఈ సమాజ్వాదీ పార్టీ అధినేత చేసిన ప్రకటన సంచలనం సృష్టించింది. కాగా, ‘‘టీకాల భద్రత విషయంలో ఇసుమంతైనా రాజీ పడేది లేదు. మేము అనుమతులిచ్చిన వ్యాక్సిన్లు నూటికి 110 శాతం సురక్షితం. అన్ని టీకాల మాదిరిగానే తేలికపాటి జ్వరం, టీకా ప్రదేశంలో నొప్పి, అలర్జీ వంటి సాధారణ విపరిణామాలు కొవిడ్ టీకా విషయంలోనూ కనిపించవచ్చు. ఐతే కరోనా టీకా వేయించుకోవటం వల్ల నపుంసకత్వం బారిన పడతారనే పుకార్లు అర్థరహితం’’ అని డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీ.జీ సోమానీ స్పష్టం చేశారు.
కాగా, టీకాకు సంబంధించి ప్రజలను తప్పుదోవ పట్టించే వదంతులను నమ్మొద్దని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. స్వప్రయోజనాలను ఆశించే కొందరు వ్యక్తులు బాధ్యతారహితమైన ప్రవర్తన వల్ల ఈ విధమైన పుకార్లు వ్యాప్తిస్తాయన్నారు. బాధ్యతాయుత పౌరులుగా ఇటువంటి ప్రచారాలకు దూరంగా ఉండటమే కాకుండా.. అవి సామాజిక మాధ్యమాల్లో వాటిని వ్యాప్తించకుండా నిరోధించాలని ప్రధాని ప్రజలను కోరారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
భక్తులంతా వేయికళ్లతో ఎదురుచూసిన సింహాద్రి అప్పన్న స్వామి నిజరూప దర్శనం సాక్షాత్కారమైంది. వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని సింహాచలంలో చందనోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (10/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
సినీ నటుడు చిరంజీవి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి నాటి జ్ఞాపకాలను ఒకరితో ఒకరు పంచుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
తెలుగు ఇండస్ట్రీలో నటించాలంటే కష్టం.. ఎందుకంటే: సంయుక్తా మేనన్
-
ఆటలో క్వాలిటీ ముఖ్యం.. ఆత్మగౌరవం కోసం ఆడే స్థితికొచ్చాం: విరాట్
-
వైభవంగా సింహాద్రి అప్పన్న చందనోత్సవం.. భారీగా తరలివచ్చిన భక్తులు
-
ఈడీ ఛార్జ్షీట్ నిందితుల జాబితాలో ఆప్ పేరు.. మద్యం కుంభకోణంలో కీలక పరిణామాలు
-
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
-
ఇరాన్ అదుపులో నౌక.. ఎట్టకేలకు భారత నావికుల్లో ఐదుగురికి విముక్తి