Chandra babu Arrest: అంతా పాజిటివ్‌గానే ఉంది: ఎంపీ కేశినేని

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు.. సీఐడీ రిమాండ్‌  రిపోర్టుపై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు నుంచి బయటకు వచ్చిన విజయవాడ ఎంపీ  కేశినేని నాని మీడియాతో మాట్లాడారు.

Published : 10 Sep 2023 18:14 IST

విజయవాడ: తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టు.. సీఐడీ రిమాండ్‌  రిపోర్టుపై కాసేపట్లో ఏసీబీ కోర్టు తీర్పు వెలువరించనుంది. ఈ క్రమంలో ఏసీబీ కోర్టు నుంచి బయటకు వచ్చిన విజయవాడ ఎంపీ  కేశినేని నాని మీడియాతో మాట్లాడారు. ‘‘మా లీగల్‌ టీమ్‌ చెప్పిన అంశాలను బట్టి చూస్తే అంతా పాజిటివ్‌గానే ఉందని మా భావన. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. చంద్రబాబు దేశంలోనే స్వచ్ఛమైన నేత. రాష్ట్రంలో యువత బాగుపడాలనే సీమెన్స్‌ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. ఇది రాజకీయ ప్రేరేపిత కేసు. ఎలాంటి అవినీతి జరగలేదు. కొందరు పోలీసు అధికారులు ప్రమోషన్లు, బదిలీల కోసం అతిగా వ్యవహరిస్తున్నారు. చివరికి ధర్మానిదే అంతిమ విజయం. చంద్రబాబు కడిగిన ముత్యంలా బయటకు వస్తారు’’ అని ఎంపీ కేశినేని నాని అన్నారు. మరో వైపు విజయవాడ కోర్టు వద్ద పోలీసు భద్రతను కుదించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని