KTR: తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో న్యాయం జరిగేలా చూడాలి: కేటీఆర్
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసుపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు.
హైదరాబాద్: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసుపై భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఆమె మృతికి కారణమైన పోలీసుపై సాక్ష్యాధారాలు లేకపోవడంతో నేరాభియోగాలు మోపడం లేదని అక్కడి అధికారులు చెప్పడంపై ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఆమోదయోగ్యం కాదన్నారు. ఈ అంశంపై అమెరికా రాయబార కార్యాలయం వెంటనే జోక్యం చేసుకొని అక్కడి ప్రభుత్వ వర్గాలతో మాట్లాడి జాహ్నవి కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
జాహ్నవి కందుల మృతికి కారణమైన పోలీసుపై నేరాభియోగాల్లేవ్!
భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి.. ఎలాంటి పక్షపాతం లేకుండా విచారణ జరిగేలా ఒత్తిడి తీసుకురావాలని కోరారు. ఉన్నత లక్ష్యాలతో అగ్రరాజ్యం వెళ్లిన జాహ్నవి ప్రమాదంలో చనిపోవడం అత్యంత విషాదకరమైతే, ఆమెకి జరగాల్సిన న్యాయం జరగకుండా కేసు తేలిపోవడం అంతకన్నా బాధాకరమని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన 23 ఏళ్ల కందుల జాహ్నవి (Jaahnavi Kandula) 2023 జనవరిలో సియాటెల్లోని పోలీసు పెట్రోలింగ్ వాహనం ఢీకొని మృతిచెందిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రపంచం ఇలా ఎందుకు ఉండలేకపోతోంది..!: ఆనంద్ మహీంద్రా
-
మరో ‘బాహుబలి’ వచ్చేస్తోంది.. క్రేజీ అప్డేట్ ఇచ్చిన రాజమౌళి
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
ఫ్లిప్కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గెలాక్సీ ఎస్23పై ₹20వేలు డిస్కౌంట్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (01/05/24)
-
సత్తా చాటిన ‘పొలిమేర 2’, ‘ఉస్తాద్’.. ఉత్తమ నటుడిగా నవీన్ చంద్ర