KTR: స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో మనదే సింహభాగం: కేటీఆర్‌

మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన  స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

Published : 15 Aug 2023 12:54 IST

సిరిసిల్ల: మన మున్సిపాలిటీలు, పట్టణాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్లలో నిర్వహించిన  స్వాతంత్ర్య వేడుకల్లో మంత్రి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా పాఠశాలలను తీర్చిదిద్దినట్లు చెప్పారు. జిల్లాలో 172 కళాశాలల్లో వసతులు కల్పించామన్నారు. ఒకనాడు దగాపడిన పల్లెలు నేడు ధగధగలాడుతున్నాయని చెప్పారు. స్వచ్ఛ సర్వేక్షణ్‌ అవార్డుల్లో రాష్ట్రానిదే సింహభాగమని కేటీఆర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని