Mulapeta Port: మూలపేట పోర్టు వాహనాలను అడ్డుకున్న నిర్వాసితులు
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. మూలపేట పోర్టుకు వచ్చే వాహనాలను విష్ణుచక్రం గ్రామస్థులు ఆదివారం అడ్డుకుని ధర్నా చేపట్టారు.
సంతబొమ్మాళి: శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేటలో చేపడుతున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు నిర్మాణ పనులను నిర్వాసితులు అడ్డుకున్నారు. మూలపేట పోర్టుకు వచ్చే వాహనాలను విష్ణుచక్రం గ్రామస్థులు ఆదివారం అడ్డుకుని ధర్నా చేపట్టారు. తమకు పూర్తిస్థాయిలో పరిహారం చెల్లించలేదని ఆందోళనకు దిగారు.
ఈ ఏడాది ఏప్రిల్ 19న సీఎం జగన్ చేతుల మీదుగా రూ.4 వేలకోట్లతో ఓడరేవు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. పూర్తిస్థాయిలో నిర్వాసితుల భూములు, ఇళ్లు, చెట్లు తదితర వాటికి పరిహారం చెల్లించాకే పోర్టు పనులు చేపడతామని అప్పట్లో హామీ ఇచ్చారు. ఇప్పటికి 250 ఎకరాల భూములు.. మూలపేట, విష్ణుచక్రం గ్రామాల్లో 545 పీడీఎఫ్(ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ ఫ్యామిలీ)లకు మాత్రమే పరిహారం చెల్లించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ ఆధీనంలోని ప్రభుత్వ భూములు.. వందల ఎకరాల్లో జీడిచెట్లకు పరిహారం చెల్లించలేదు. దీంతోపాటు కొలతలు తీసిన ఇళ్లకూ పరిహారం అందజేయలేదు. మిగతా పరిహారం అందజేయకుండానే పనులు చేపట్టడంతో నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిర్వాసితుల పేరు చెప్పి వైకాపా కార్యకర్తలకే పనులు: మూలపేట సర్పంచ్
స్థానిక యువతకు ఎలాంటి ఉపాధి లేదని.. కూలీలకు పనులు కల్పించడం లేదని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోర్టు వాహనాలు తిరగడంతో రహదారి ధ్వంసమైందని.. రాకపోకలకు ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. నిర్వాసితుల పేర్లు చెప్పి వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తన అనుచరులు, వైకాపా కార్యకర్తలకు పనులు అప్పగిస్తున్నారని మూలపేట సర్పంచి జి.బాబూరావు ఆరోపించారు. తమకు ఉపాధి కల్పించేవరకు పోర్టు వాహనాలను విడిచిపెట్టబోమని తేల్చి చెప్పారు. నిర్వాసితుల ఆందోళన సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు, నిర్వాసితుల మధ్య వాదోపవాదాలు జరిగాయి. సుమారు 3 గంటలుగా అక్కడ వాహనాలు నిలిచిపోయాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (17/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
‘గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ సెక్యూరిటీ’.. వీడియో వైరల్
Viral video: గున్న ఏనుగుకు కుటుంబమే జెడ్ క్లాస్ సెక్యూరిటీ కల్పిస్తున్న వీడియో నెట్టింట వైరల్గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
‘వన్ చిప్ ఛాలెంజ్’ వల్లే బాలుడి మృతి.. ఇంతకీ ఏంటీ సవాల్?
-
వరల్డ్ కప్ జట్టులో హార్దిక్.. విమర్శలపై క్లారిటీ ఇచ్చిన జై షా
-
అటల్ సేతుపై రష్మిక వీడియో.. స్పందించిన మోదీ
-
అతడు నన్ను కాలితో తన్నాడు.. కడుపుపై కొట్టాడు: దాడి ఘటనపై స్వాతి మాలీవాల్
-
ఆ రూమర్స్కు చెక్ పెట్టిన నిర్మాణ సంస్థ.. ‘SSMB29’పై క్లారిటీ
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,365