Bhuvaneswari: రైలు ప్రమాద బాధితులను పరామర్శించనున్న భువనేశ్వరి

విజయనగరం జిల్లా రైలు ప్రమాద బాధితులను తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 31న పరామర్శించనున్నారు.

Updated : 30 Oct 2023 17:38 IST

అమరావతి: విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాద బాధితులను తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 31న పరామర్శించనున్నారు. అలాగే చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఆమె చేపట్టిన మలివిడత ‘నిజం గెలవాలి’ కార్యక్రమం నవంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. మూడు రోజుల పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఈ పర్యటన కొనసాగనుంది. కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది మృతి చెందిన వారి కుటుంబాలను భువనేశ్వరి పరామర్శిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని