AP News: దొంగ ఓట్లతో గెలిచి.. భారీ మెజార్టీ వచ్చిందని గొప్పలు చెప్పారు: నిమ్మగడ్డ రమేశ్‌

గతంలో తిరుపతి ఉపఎన్నికలో 35 వేల దొంగ ఓట్లు వేశారని సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. విజయవాడలో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated : 23 Mar 2024 15:10 IST

విజయవాడ: గతంలో తిరుపతి ఉపఎన్నికలో 35 వేల దొంగ ఓట్లు వేశారని సీఎఫ్‌డీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్ అన్నారు. విజయవాడలో సిటిజన్‌ ఫర్‌ డెమోక్రసీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ వచ్చిందని వైకాపా నేతలు గొప్పలు చెప్పారని విమర్శించారు. ఓటర్‌ ప్రొఫైల్‌ అనేది వాలంటీర్లు ఎప్పుడో సేకరించి పెట్టారన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రధాని సభకు వెళ్లారని ఒక వ్యక్తిని చంపడం సరికాదన్నారు. ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియకు వాలంటీర్లను దూరంగా ఉంచాలని డిమాండ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని