
సాగునీటి ప్రాజెక్టులపై ముగిసిన సీఎం సమీక్ష
అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులకు సకాలంలో పూర్తి చేయాలని సంబంధిత ఉన్నతాధికారులను ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు.రాష్ట్రంలోని పోలవరం,వెలిగొండ, అవుకు టన్నెల్-2 పనుల్లో జాప్యం లేకుండా చూడాలని సంబంధిత అధికారులకు సీఎం సూచించారు.ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు హెడ్ వర్క్్స, కాలువల పనుల పురోగతిని సీఎంకు అధికారులు వివరించారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని సంబంధిత అధికారులు సీఎంకు వివరించారు. నిర్ణీత వ్యవధిలో ప్రాజెక్టు పూర్తవుతుందని ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం ప్రాజెక్టు అప్రోచ్, స్పిల్ ఛానెల్ పనులు మే నాటికి పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. అంతకు ముందే కాఫర్ డ్యామ్ పనులను పూర్తి చేయాలని సూచించారు.
విశాఖ తాగునీటి అవసరాలను తీర్చేలా పోలవరం నుంచి ప్రత్యేక పైపులైన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. పంపింగ్ లేకుండా గ్రావిటీ ద్వారా నీటిని పంపించే ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సూచించారు. తద్వారా విద్యుత్తు వినియోగం లేకుండా చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రాజెక్టులో నీరు 41.15 అడుగులకు చేరినా బ్యాక్ వాటర్తో సమస్యలు రాకూడదని సీఎం అధికారులకు వివరించారు. అంతేకాకుండా సమస్యలు లేకుండా భూసేకరణ, ఆర్అండ్ ఆర్ పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. నిర్వాసితులకు సైతం ఇబ్బంది లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.ప్రకాశం జిల్లాలోని పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు హెడ్ రెగ్యులేటరీ పనులపైనా సీఎం సమీక్షించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Maharashtra crisis: ఓవైపు విమర్శలు.. మరోవైపు బుజ్జగింపులు
-
India News
India Corona : భారీగా తగ్గిన కొత్త కేసులు..
-
Movies News
Nagababu: దయచేసి అందరూ ఇలా చేయండి: నాగబాబు
-
Related-stories News
National News: యూపీలో తామ్రయుగ ఆయుధాలు
-
Politics News
Atmakur bypoll: 8 రౌండ్ల లెక్కింపు పూర్తి.. 32వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో విక్రమ్రెడ్డి
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Weekly Horoscope : రాశిఫలం ( జూన్ 26 - జులై 02 )
- మా ఆయన కోసం సల్మాన్ఖాన్ని వదులుకున్నా!
- Actor Sai kiran: మోసం చేశారంటూ పోలీస్స్టేషన్లో సినీ నటుడు సాయికిరణ్ ఫిర్యాదు
- ప్రశ్నించానని పాలు, నీళ్లు లేకుండా చేశారు
- AP Liquor: మద్యంలో విషం
- Yuvraj Singh - RaviShastri: ఆరోజు యువరాజ్ ఐదో సిక్సర్ కొట్టగానే..: రవిశాస్త్రి
- Rohit Sharma: టీమ్ఇండియాకు షాక్.. రోహిత్ శర్మకు కరోనా
- Teesta Setalvad: పోలీసుల అదుపులో తీస్తా సీతల్వాడ్
- New Labour codes: వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న చేతికొచ్చే వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్..!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (26-06-2022)