Road Accident: జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. తల్లి, కుమారుడు మృతి

ప్రొక్లెయిన్, కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని మెరుగైన వైద్యం కోసం కుమారుడు హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది.

Published : 17 May 2022 16:35 IST

జడ్చర్ల: ప్రొక్లెయిన్, కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిని మెరుగైన వైద్యం కోసం కుమారుడు హైదరాబాద్‌కు తీసుకెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. కోయిలకొండకు చెందిన బిజినపల్లి ప్రమీల కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె చిన్న కుమారుడు యాదయ్య, కుమార్తె, పెద్ద కోడలు కలిసి.. ప్రమీలను కారులో హైదరాబాదుకు తీసుకెళ్తున్నారు. జడ్చర్ల సమీపంలోకి రాగానే..  పొక్లెయిన్ - కారు బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రమీల, ఆమె కుమారుడు యాదయ్య అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్ శివకుమార్ తీవ్రంగా గాయపడగా.. రాములమ్మ, యాదమ్మకు స్వల్ప గాయాలయ్యాయి. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని