మరో 3 రోజుల్లో సౌదీలో టీకా పంపిణీ!
సౌదీ అరేబియా మరో మూడు రోజుల్లో వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఫైజర్ టీకాను ఆమోదించిన వారంరోజుల్లోనే వారు ఈ నిర్ణయాన్ని ప్రకటించారు.
దుబాయ్: సౌదీ అరేబియా మరో మూడు రోజుల్లో కరోనా వ్యాక్సిన్ను పంపిణీ చేయనున్నట్లు సమాచారం. ఫైజర్ టీకాను ఆమోదించిన వారం రోజుల్లోనే వారీ నిర్ణయం తీసుకున్నారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమంలో ప్రజలంతా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంగళవారం సాయంత్రం ప్రభుత్వం కోరింది. ఈ టీకాను మూడు దశల్లో ప్రజలకు అందించనున్నట్లు తెలిసింది.
మొదటి దశలో 65ఏళ్లు పైబడిన వారు, దీర్ఘకాలిక రోగులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి టీకా ఇవ్వనున్నారు. వైరస్కు ఎక్కువ ప్రభావితం అయ్యేవారికి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత రెండో దశలో 50 ఏళ్లకు పైబడిన వారికి ఇస్తారు. మూడో దశలో మిగతా అందరికీ టీకా వేయిస్తారు. వ్యాక్సిన్ పంపిణీ తేదీలు, తదితర వివరాలు ప్రభుత్వం తెలియజేయలేదు. బ్రిటన్, కెనెడా, అమెరికా ఇప్పటికే టీకా పంపిణీ కార్యక్రమాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. సౌదీలో ఇప్పటి వరకు 3,60,000 కరోనా కేసులు, 6,000 మరణాలు నమోదయ్యాయి. కరోనా కేసుల్లో సౌదీ గల్ఫ్ దేశాల్లో మొదటి స్థానంలో ఉంది. కానీ రికవరీలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. -
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్
వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
ఓటేశాక.. వృద్ధులను వదిలేశారు..
ఎన్నికల ముందు ప్రతిపక్షనేత హోదాలో పాదయాత్ర చేసిన జగన్ ఎన్నో హామీలు గుప్పించారు. అన్ని వర్గాలను మాటలతో మెప్పించి.. అనంతరం నిండా ముంచారు. -
జిల్లాలో తేలికపాటి వర్షాలు
జిల్లాలోని రెండు ప్రాంతాల్లో తేలిక పాటి వర్షాలు కురిశాయి. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. మొత్తం 5.2 మిల్లీ మీటర్ల వర్షం పడగా, సగటు వర్షపాతం 0.26 మి.మీ.గా ఉంది. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
సమంత ఫొటోపై చర్చ.. ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అభిమానులు
-
దిల్లీ మద్యం కేసు.. కవితకు మళ్లీ చుక్కెదురు
-
కుర్రాళ్లు ఇంకా నేర్చుకోవాలి.. ఒత్తిడిని తట్టుకోవాలి: కేఎల్ రాహుల్
-
అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్
-
ధోనీకి ఎవరైనా చెప్పండి.. కనీసం 4 ఓవర్లు బ్యాటింగ్ చేయమని!: భారత మాజీ క్రికెటర్లు
-
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్.. నేను ప్రత్యక్ష బాధితుడిని: విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్