33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ!
కర్ణాటకలో శివమొగ్గ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు దశాబ్దాలుగా ప్రధానంగా రెండు కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది.
ఇంటర్నెట్ డెస్క్: కర్ణాటకలో ఆ నియోజకవర్గం ప్రత్యేకం. రెండు కుటుంబాల మధ్యే ప్రధాన పోటీ. రాష్ట్రంలో అత్యంత శక్తిమంతమైన రాజకీయ కుటుంబాల నుంచి నేతలు ఇక్కడ పోటీపడుతున్నారు. 33 ఏళ్లుగా ఈ రాజకీయ వైరం కొనసాగుతున్న ఆ నియోజకవర్గమే శివమొగ్గ. షిమోగ అని కూడా పిలుస్తారు.
ఈ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి యడియురప్ప, దివంగత ఎస్ బంగారప్ప కుటుంబాల మధ్య హైవోల్టేజ్ పోటీ ఉంటుంది. ప్రస్తుత ఎన్నికల్లో యడియూరప్ప కుమారుడు సిటింగ్ ఎంపీ రాఘవేంద్ర భాజపా తరఫున, బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్కుమార్ కాంగ్రెస్ తరఫున ఇక్కడ బరిలో ఉన్నారు. ఈమె కన్నడ సూపర్స్టార్ శివరాజ్కుమార్ భార్య. రాఘవేంద్ర సోదరుడు విజయేంద్ర రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా ఉండగా.. గీత సోదరుడు మధు బంగారప్ప సిద్ధరామయ్య కేబినెట్లో మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక భాజపా రెబల్గా పోటీలో ఉన్న కేఎస్ ఈశ్వరప్ప కూడా ఇక్కడ కీలకంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ వైరం ఇప్పటిది కాదు..
ఈ నియోజకవర్గంలో బంగారప్ప, యడియూరప్ప కుటుంబాల మధ్య రాజకీయ వైరం 33 ఏళ్లుగా కొనసాగుతోంది. ఈ రెండు కుటుంబాల నుంచి బరిలోకి దిగిన నేతలు నువ్వా.. నేనా అన్నట్లు తలపడుతున్నారు.
- 1991 లోక్సభ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీ చేసిన యడియూరప్ప.. బంగారప్ప సమీప బంధువు కేజీ శివప్ప(కాంగ్రెస్) చేతిలో ఓడిపోయారు.
- 2009లో యడియూరప్ప కుమారుడు రాఘవేంద్ర.. బంగారప్పను ఓడించి తన ప్రతీకారం తీర్చుకున్నారు.
- 2014లో యడియూరప్ప గెలుపొందగా.. జేడీఎస్ టికెట్పై పోటీ చేసిన గీత మూడో స్థానంలో నిలిచారు.
- 2018 ఉప ఎన్నికలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాఘవేంద్రపై మధు బంగారప్ప ఓడిపోయారు. ఈ రెండు కుటుంబాల మధ్య ఇంత తీవ్రమైన పోటీ ఉన్న నేపథ్యంలో ఈసారి ఓటర్లు ఎవరివైపు నిలుస్తారో చూడాలి.
అగ్రనేతల ప్రచారం..
విజయమే లక్ష్యంగా భాజపా, కాంగ్రెస్ తరఫున ఇక్కడ అగ్రనేతలు ప్రచారంలోకి దిగారు. ప్రధాని మోదీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికే ఇక్కడ ప్రచారం నిర్వహించి కార్యకర్తల్లో జోష్ నింపారు. మరోవైపు ఇరుపార్టీల తరఫున డజన్కుపైగా కీలక నేతలను ఇక్కడ మోహరించారు. భాజపా ముఖ్యంగా మోదీ, యడియూరప్ప పేర్లు చేప్పి ఓట్లు అడుగుతుండగా.. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ఐదు గ్యారంటీలతో ప్రచారం నిర్వహిస్తోంది. గీత భర్త కన్నడ సూపర్ స్టార్ శివరాజ్కుమార్ ఈ ప్రచారానికి సినీ గ్లామర్ను జోడించారు. భాజపా విజయం సాధిస్తే ఇక్కడ యడియూరప్ప కుటంబం పట్టు మరింత పెరుగుతుంది. గీత గెలుపొందితే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది.
కమలానికి తలపోటు..
హిందుత్వ నాయకుడిగా పేరున్న భాజపా సీనియర్ నేత కేఎస్ ఈశ్వరప్ప పార్టీపై తిరుగుబావుటా ఎగురవేసి ఇక్కడ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. తన కుమారుడు కేఎస్ కాంతేశ్కు పార్టీ టికెట్ దక్కకపోవడంతో నిరాశకు గురై ఈ చర్యకు పాల్పడ్డారు. ఎన్నికల సమయంలో పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థుల బెడద సహజమే అయినా.. శివమొగ్గ కథ కొంత భిన్నం. ఇక్కడ బరిలో ఉన్న బి.వై.రాఘవేంద్ర భాజపా సిద్ధాంతాలు, ప్రధాని మోదీ నాయకత్వం, హిందుత్వం పేరిట ప్రచారం చేస్తుండగా.. ఈశ్వరప్ప కూడా సరిగ్గా అవే అంశాలను ప్రచారంలో ప్రస్తావిస్తున్నారు. మూడో విడతలో భాగంగా శివమొగ్గలో మే 7న ఎన్నికల పోలింగ్ జరగనుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
పుట్టెడు దుఃఖంలోనూ అవయవదానం!
-
ప్రధాని మోదీ ఉల్లంఘనలపై చర్యలకు ఆదేశించే డీఎన్ఏ ఈసీలో లేదు: సీతారాం ఏచూరి
-
చిరంజీవిని కలిసిన గంటా
-
భూమి రాసివ్వకపోతే చంపేస్తామన్నారు.. సినీఫక్కీలో ఆలయ పూజారి కిడ్నాప్
-
పేకమేడలా.. జగనన్న ఇళ్లు.. చేతితో లాగితే ఊడుతున్న శ్లాబ్!
-
సిగ్నల్కు బురద పూసి రైళ్లలో దోపిడీకి యత్నం