Sunita Williams: అక్కడికి వెళ్తే.. ఇంటికి తిరిగి వెళ్లినట్టుగా ఉంటుంది: సునీతా విలియమ్స్‌

మూడోసారి అంతరిక్షయానానికి సిద్ధమయ్యారు భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams). ఈ సందర్భంగా ఆమె తన ఇష్టాలను వెల్లడించారు. 

Updated : 06 May 2024 12:02 IST

వాషింగ్టన్‌: భారత సంతతికి చెందిన అమెరికన్‌ వ్యోమగామి సునీతా విలియమ్స్‌(Sunita Williams).. మూడోసారి రోదసీ యాత్రకు సిద్ధమయ్యారు. బోయింగ్ సంస్థకు చెందిన స్టార్‌లైనర్‌ వ్యోమనౌకలో అంతరిక్షయానం చేయనున్నారు. భారత కాలమానం ప్రకారం మే 7 ఉదయం 8.04 గంటలకు ఈ వ్యౌమనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇందులో ఆమె మిషన్‌ పైలట్‌గా వ్యవహరించనున్నారు.

ఈ క్రమంలో సునీత (Sunita Williams) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..‘‘ గణేశుడు నా ‘గుడ్ లక్‌ ఛార్మ్‌’. విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని తీసుకువెళతాను. నేను ఆధ్యాత్మిక వాదిని. అలాగే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ISS) వెళ్తుంటే.. ఇంటికి తిరిగి వెళ్తున్నట్టుగా ఉంటుంది’’ అని వెల్లడించారు. అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా వాణిజ్య కార్యక్రమంలో భాగంగా స్టార్‌లైనర్‌కు ఇది మొదటి మానవసహిత యాత్ర. దీని గురించి కాస్త ఆందోళనగానే ఉన్నా.. గాబరా పడిపోయే పరిస్థితి ఏమీ లేదన్నారు. అలాగే ఆమెకు స్పేస్‌లో సమోసాను ఆస్వాదించడమంటే ఇష్టమట. ఆమె ఒక మారథాన్‌ రన్నర్. ఐఎస్‌ఎస్‌లో ఓసారి మారథాన్‌ కూడా చేశారు. 

అప్పుడు అంతరిక్షంలోకి భగవద్గీత తీసుకెళ్లా!

నాసా తన ‘కమర్షియల్‌ క్రూ ప్రోగ్రామ్‌’లో భాగంగా తొలి మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు సిద్ధమైంది. ఇందులో సునీతా విలియమ్స్‌తో పాటు మరో వ్యోమగామి బచ్‌ విల్‌మోర్‌ అంతరిక్ష యానం చేయనున్నారు. ఈ రాకెట్‌లో వీరిద్దరూ ప్రయాణించి , ఐఎస్‌ఎస్‌కు చేరుకొని.. అక్కడ వారం రోజుల పాటు ఉండనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని