Covidతో వాసన కోల్పోయారా..?ఇలా ప్రయత్నించండి!
కరోనా వైరస్ సోకిన వారిలో కొందరికి వాసన కోల్పోతున్న వారికి స్టిరాయిడ్ల వాడడం మంచిది కాదని.. స్మెల్ ట్రెయినింగ్ ద్వారా వాసన సమస్యను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచించింది.
మందులతో ప్రయోజనం తక్కువేనంటున్న నిపుణులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ సోకిన వారిలో అనేకమంది వాసన కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు కొన్ని రకాల మందులను వాడడం ద్వారా మళ్లీ వాసన పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇలాంటి స్టెరాయిడ్లు వాడడం మంచిది కాదని.. కొన్ని సహజ ప్రక్రియల ద్వారా వాసన సమస్యను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేస్తోంది.
కొవిడ్ లక్షణాల్లో వాసన కోల్పోవడం కూడా ఒకటని ఇప్పటికే నిపుణులు గుర్తించారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తిరిగి వాసన గుర్తించడం కష్టమవుతోందని పలువురు బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టెరాయిడ్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ)తో పాటు అంతర్జాతీయ నిపుణులు బృందం ఓ అధ్యయనం చేపట్టింది. తద్వారా కార్టికో స్టెరాయిడ్లు వాడడం వల్ల కేవలం స్వల్ప ప్రయోజనం మాత్రమే ఉంటుందని నిపుణుల బృందం గుర్తించింది. వాసన తిరిగి పొందేందుకు ఇలాంటి మందులను వినియోగించకూడదని యూఈఏకు చెందిన ప్రొఫెసర్ కార్ల్ ఫిల్పాట్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న వేళ.. వీటి చికిత్సకు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ బారినపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వాసన కోల్పోయే లక్షణం ఉంటున్నట్లు అంచనా. అయితే, దాదాపు 90శాతం మంది పూర్తిగా వాసన సమస్య నుంచి బయటపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. కానీ, కొందరిలో కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఎనిమిది వారాలైనా తిరిగి వాసనను పసిగట్టే లక్షణం పొందలేకపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
‘స్మెల్ ట్రెయినింగ్’తో ప్రయోజనం..
ఎలాంటి మందులు వాడకుండానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ‘స్మెల్ ట్రెయినింగ్’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు వేర్వేరు వాసనలు కలిగిన నాలుగు పదార్థాలను రోజుకు రెండుసార్లు పీల్చుకోవాలని చెబుతున్నారు. తద్వారా మెదడుకు సంబంధించి తనకు తానే పునర్వవస్థీకరించుకునే (న్యూరోప్లాస్టిసిటీ) సామర్థ్యాన్ని పొందుతుందని పేర్కొన్నారు. కరోనా నుంచే కాకుండా వివిధ కారణాల వల్ల వాసన కోల్పోయిన వారికి చౌకగా, తేలికైన మార్గంలో ఎలాంటి దుష్ర్పభావాలు లేని చికిత్స అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
శరీరంలో సంభవించే వాపులను తగ్గించేందుకు కొన్నిరకాలైన కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తారు. అస్తమా వంటి సమస్యలకు వినియోగించే ఈ మందులను వాసన కోల్పోతున్నవారికి కొందరు వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే, వీటి వల్ల అధిక రక్తపోటు, మానసిక, శారీరక ప్రవర్తనలో మార్పుల వంటి దుష్ర్పభావాలు కూడా కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే సహజంగా ‘స్మెల్ ట్రెయినింగ్’తో వాసన సమస్యలను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
Viral Video: స్పైడర్ మ్యాన్, స్పైడర్ ఉమెన్ దుస్తుల్లో దిల్లీ రోడ్లపై చక్కర్లు కొట్టిన జంటను పోలీసులు అరెస్టు చేశారు. ఎందుకంటే? -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ సంచలన ఆరోపణలు చేశారు. -
అవసరమైతే తప్ప బయటకు రావొద్దు: వాతావరణశాఖ
రాష్ట్రంలో 3 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
పిఠాపురంలో రూ.80లక్షల విలువైన మద్యం పట్టివేత
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
అలెన్ హెర్బల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం