Covidతో వాసన కోల్పోయారా..?ఇలా ప్రయత్నించండి!
కరోనా వైరస్ సోకిన వారిలో కొందరికి వాసన కోల్పోతున్న వారికి స్టిరాయిడ్ల వాడడం మంచిది కాదని.. స్మెల్ ట్రెయినింగ్ ద్వారా వాసన సమస్యను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచించింది.
మందులతో ప్రయోజనం తక్కువేనంటున్న నిపుణులు
ఇంటర్నెట్ డెస్క్: కరోనా వైరస్ సోకిన వారిలో అనేకమంది వాసన కోల్పోతున్న విషయం తెలిసిందే. ఇలాంటి వారు కొన్ని రకాల మందులను వాడడం ద్వారా మళ్లీ వాసన పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే, ఇలాంటి స్టెరాయిడ్లు వాడడం మంచిది కాదని.. కొన్ని సహజ ప్రక్రియల ద్వారా వాసన సమస్యను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం స్పష్టంచేస్తోంది.
కొవిడ్ లక్షణాల్లో వాసన కోల్పోవడం కూడా ఒకటని ఇప్పటికే నిపుణులు గుర్తించారు. అయితే, కరోనా నుంచి కోలుకున్న తర్వాత కూడా తిరిగి వాసన గుర్తించడం కష్టమవుతోందని పలువురు బాధితులు వైద్యులను సంప్రదిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టెరాయిడ్ల ప్రభావాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా (యూఈఏ)తో పాటు అంతర్జాతీయ నిపుణులు బృందం ఓ అధ్యయనం చేపట్టింది. తద్వారా కార్టికో స్టెరాయిడ్లు వాడడం వల్ల కేవలం స్వల్ప ప్రయోజనం మాత్రమే ఉంటుందని నిపుణుల బృందం గుర్తించింది. వాసన తిరిగి పొందేందుకు ఇలాంటి మందులను వినియోగించకూడదని యూఈఏకు చెందిన ప్రొఫెసర్ కార్ల్ ఫిల్పాట్ పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్న వేళ.. వీటి చికిత్సకు కూడా భారీ డిమాండ్ ఏర్పడిందన్నారు.
ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ బారినపడుతున్న ప్రతి ఐదుగురిలో ఒకరికి వాసన కోల్పోయే లక్షణం ఉంటున్నట్లు అంచనా. అయితే, దాదాపు 90శాతం మంది పూర్తిగా వాసన సమస్య నుంచి బయటపడుతున్నట్లు తాజా పరిశోధనలో తేలింది. కానీ, కొందరిలో కొవిడ్ నుంచి కోలుకున్నప్పటికీ ఎనిమిది వారాలైనా తిరిగి వాసనను పసిగట్టే లక్షణం పొందలేకపోతున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
‘స్మెల్ ట్రెయినింగ్’తో ప్రయోజనం..
ఎలాంటి మందులు వాడకుండానే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ‘స్మెల్ ట్రెయినింగ్’ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇందుకు వేర్వేరు వాసనలు కలిగిన నాలుగు పదార్థాలను రోజుకు రెండుసార్లు పీల్చుకోవాలని చెబుతున్నారు. తద్వారా మెదడుకు సంబంధించి తనకు తానే పునర్వవస్థీకరించుకునే (న్యూరోప్లాస్టిసిటీ) సామర్థ్యాన్ని పొందుతుందని పేర్కొన్నారు. కరోనా నుంచే కాకుండా వివిధ కారణాల వల్ల వాసన కోల్పోయిన వారికి చౌకగా, తేలికైన మార్గంలో ఎలాంటి దుష్ర్పభావాలు లేని చికిత్స అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
శరీరంలో సంభవించే వాపులను తగ్గించేందుకు కొన్నిరకాలైన కార్టికో స్టెరాయిడ్లను వినియోగిస్తారు. అస్తమా వంటి సమస్యలకు వినియోగించే ఈ మందులను వాసన కోల్పోతున్నవారికి కొందరు వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. అయితే, వీటి వల్ల అధిక రక్తపోటు, మానసిక, శారీరక ప్రవర్తనలో మార్పుల వంటి దుష్ర్పభావాలు కూడా కలుగుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. అందుకే సహజంగా ‘స్మెల్ ట్రెయినింగ్’తో వాసన సమస్యలను అధిగమించవచ్చని అంతర్జాతీయ నిపుణుల బృందం సూచించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
నాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని
జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు తెలుపుతూ నాని పోస్ట్ పెట్టారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
దావత్ కావాలా నాయనా!.. వ్యవసాయ క్షేత్రాల్లో కార్యకర్తల ఖుషీ
ఎన్నికల పండుగొచ్చింది.. దావత్ల మీద దావత్లు ఏర్పాటవుతున్నాయి. కార్యకర్తలను మచ్చిక చేసుకోవడానికి, ప్రచారంలో జోరు ఉండటానికి నాయకులు విందు కార్యక్రమాలను ఎంచుకుంటున్నారు. -
ఆదర్శ కేంద్రం.. ఓటుకు కదులుదాం
లోక్సభ ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల సంఘం ప్రత్యక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దివ్యాంగులు, 85 ఏళ్లకు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించే అవకాశం కల్పించారు. -
పోస్టల్ బ్యాలెట్ ఇంకా రెండు రోజులే!
ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు 16,972 మంది పోస్టల్ బ్యాలెట్ నమోదు చేసుకోగా.. ఇప్పటి వరకు 5,200 మంది మాత్రమే వినియోగించుకున్నారు. -
రూ.2 చెల్లించు.. ఛాలెంజ్ ఓటేయ్
ఛాలెంజ్ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. -
భాజపా అభ్యర్థితో కాదు ప్రధానితోనే పోటీ
మనకు పోటీ భాజపా అభ్యర్థితో కాదని, ప్రధాని నరేంద్ర మోదీతోనే పోటీ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఆ లెక్కలు నాకు తెలియదు.. అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: హార్దిక్ పాండ్య
-
సిద్ధార్థ్ వల్లే ప్రేమపై నమ్మకం పెరిగింది: అదితి రావ్
-
ఇజ్రాయెల్ ఆధీనంలో రఫా క్రాసింగ్
-
దటీజ్ ధోనీ.. లోయర్ ఆర్డర్లో ఎందుకొస్తున్నాడో తెలుసా..?
-
మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు.. జనసేనకు మద్దతు ప్రకటించిన నాని