TSPSC Group-1: ఆ నలుగురికీ హాల్‌టికెట్లు ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు

టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 పేపర్‌ లీకేజీ నిందితులకు హాల్‌టికెట్లు ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. 

Published : 10 Jun 2023 21:16 IST

హైదరాబాద్‌: ప్రశ్నపత్రాల లీకేజీ నిందితులు గ్రూప్‌- 1 ప్రిలిమ్స్‌ రాసేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇవ్వడంపై టీఎస్‌పీఎస్సీ అప్పీలు దాఖలు చేసింది. నలుగురు నిందితులను పరీక్షకు అనుమతించాలంటూ శుక్రవారం సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులును కొట్టివేయాలని కోరుతూ కమిషన్ అధికారులు హౌజ్‌మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శనివారం న్యాయమూర్తి ఇంట్లో జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి, జస్టిస్‌ ఎన్‌ రాజేశ్వరరావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. పరీక్షకు అనుమతించి.. ఫలితాలు ప్రకటించవద్దన్న సింగిల్‌ జడ్జి ఉత్తర్వుల్లో జోక్యానికి నిరాకరించింది. నిందితులు షమీమ్‌, సురేష్‌, రమేష్‌, సాయి సుష్మితలకు హాల్‌టికెట్లు ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశిస్తూ అప్పీలును కొట్టివేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని