Ts News: 300 స్టాల్స్.. 20 రోజులు.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫెస్టివల్ మేళా
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫెస్టివల్ మేళా, మినీ నుమాయిష్ను నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది...
హైదరాబాద్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఫెస్టివల్ మేళా, మినీ నుమాయిష్ను నిర్వహించనున్నట్లు ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది. దసరా, దీపావళి పండుగల దృష్ట్యా ఫెస్టివల్ మేళా నిర్వహించబోతున్నామని సొసైటీ కార్యదర్శి ప్రభాశంకర్ తెలిపారు. ఈ నెల 11 నుంచి 31వ తేదీ వరకు 20 రోజుల పాటు ఈ మేళా ఉంటుందన్నారు. ఈ సంవత్సరం నుమాయిష్ నిర్వహించకపోవడంతో కరోనా కష్టాలలో ఉన్న చిన్న పరిశ్రమలు, చేతి వృత్తుల వారికి అవకాశం కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేళాను 300 స్టాల్స్ తో నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఫుడ్ కోర్ట్, కిడ్స్ ప్లేయింగ్ గేమ్స్, హ్యాండ్లూమ్స్, కశ్మీర్, రాజస్థాని డ్రెస్సెస్కు సంబంధించిన స్టాల్స్ అందుబాటులో ఉంటాయన్నారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ అక్టోబర్ 11న సాయంత్రం 5 గంటలకు ఈ మేళాను ప్రారంభించనున్నారని ప్రభా శంకర్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం
-
వైకాపా వెన్నులో వణుకు.. చెమటలు పట్టిస్తున్న పూతలపట్టు కాంగ్రెస్ అభ్యర్థి