Saidabad: బాధిత కుటుంబానికి మంత్రుల పరామర్శ.. రూ.20లక్షల చెక్కు అందజేత 

నగరంలోని సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు నడుమ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు.

Updated : 16 Sep 2021 10:10 IST

హైదరాబాద్‌: నగరంలోని సైదాబాద్‌ బాలిక కుటుంబాన్ని భారీ బందోబస్తు నడుమ మంత్రులు మహమూద్‌ అలీ, సత్యవతి రాథోడ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు బాలిక తల్లిదండ్రులకు రూ.20 లక్షల చెక్కు అందించారు. దీంతో పాటు బాలిక కుటుంబానికి 2 పడక గదుల ఇల్లు ఇస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. నిందితుడు రాజును కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కాగా, మంత్రులు తీరును నిరసిస్తూ స్థానికులు ఆందోళనకు దిగారు. ఎటువంటి సమాచారం లేకుండా హడావిడిగా వచ్చి వెళ్లారని నిరసన తెలిపారు. హోంమంత్రి కాన్వాయ్‌ను సేవాలాల్‌ బంజారా సంఘ నేత అడ్డుకున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని